బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రస్తుతం తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కింగ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన కూతురు సుహానా ఖాన్ కీలక పాత్రలో నటిస్తోంది. తెరపై ఇద్దరు తండ్రి–కూతుళ్లుగా నటిస్తున్నారని టాక్. దీంతో ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాపై వచ్చిన పాజిటివ్ బజ్తో పాటు, షారుక్ – సుహానా పేర్లు ఇటీవల వరుసగా లీగల్ ట్రబుల్స్లో చిక్కుకోవడం హాట్ టాపిక్గా మారింది.
Also Read : Mirai : హై టికెట్ రేట్స్కి చెక్ పెట్టిన మిరాయ్.. టాలీవుడ్ కి కొత్త దారి
తాజాగా, సుహానా ఖాన్ మహారాష్ట్రలోని థాల్ గ్రామంలో రూ.12.91 కోట్ల విలువైన భూమి కొనుగోలు చేశారు. అయితే ఆ భూమి వ్యవసాయ భూమి కావడంతో, చట్టపరమైన అనుమతులు లేకుండా కొనుగోలు చేయడం ఇలీగల్ అని అధికారులు అంటున్నారు. సుహానా రైతు హోదా పొందేందుకు దాదాపు రూ.77 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ జరిపించుకున్నప్పటికీ, ఈ వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఇక మరోవైపు, షారుక్ ఖాన్ నివాసానికి సంబంధించిన ఇష్యూ కూడా పెద్దదిగా మారింది. ఆయన ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్ ఆక్యుపై చేశారని బొంబాయి మెట్రోపాలిటన్ కార్పొరేషన్ ఆరోపిస్తోంది. ఈ విషయంపై కొద్ది రోజుల క్రితం షారుక్కు నోటీసులు జారీ చేశారు. కానీ సమాధానం రాకపోవడంతో అధికారులు మళ్లీ నోటీసులు పంపారు. ఒకవైపు షూటింగ్తో బిజీగా ఉన్న షారుక్, మరోవైపు వరుసగా వస్తున్న లీగల్ సమస్యలతో ఆయన ఫ్యామిలీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈ వివాదాలు ఎలా సాల్వ్ అవుతాయో చూడాలి.