బాలీవుడ్ సొట్టబుగ్గల చిన్నది అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రీతి జింటా. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలిగింది ఈ ముద్దుగుమ్మ. ‘దిల్’ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రీతి ఆ తర్వాత.. వీర్ జారా, కోయి మిల్ గయా, క్యా కెహనా, సోల్జర్, దిల్ చాహతా హై, దిల్ హై తుమ్హారా, లక్ష్య, కభీ అల్విదా నా కెహనా, మిషన్ కాశ్మీర్ వంటి పలు చిత్రాల్లో పవర్ ఫుల్ పాత్రలు పోషించి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఇక కొన్నాళ్లుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ప్రీతి జింటా, ఇటివల సెంకండ్ ఇన్నింగ్ స్టార్ చేసి, సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంది. ఇందులో భాగంగా తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు మరో భారీ చిత్రంలో భాగం కాబోతుందట.
Also Read: Sapthagiri : సినీ నటుడు సప్తగిరి ప్రసాద్ కి మాతృ వియోగం..
బాలీవుడ్లో ‘క్రిష్’ ఫ్రాంఛైజీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించాయి మనకు తెలిసిందే. ఈ సిరీస్లో భాగంగా త్వరలో ‘క్రిష్-4’ కూడా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి హృతిక్రోషన్ నే దర్శకత్వం వహిస్తుండటం విషేశం. కాగా ఈ నాలుగో భాగాన్ని టైమ్ ట్రావెల్ కథాంశంతో దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హృతిక్రోషన్ త్రిపాత్రాభినయంలో కనిపిస్తారని టాక్ వినిపిస్తుండగా.. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటికే క్రిష్ ప్రాంఛైజీలో భాగమై మంచి పేరు తెచ్చుకున్న ప్రీతిజింతా ఇప్పుడు ‘క్రిష్-4’ లోను నటించనుందట. అలాగే ప్రియాంకచోప్రా, వివేక్ ఒబెరాయ్, రేఖా తదితరులు కూడా ఈ నాలుగో భాగంలో నటించనున్నట్లు సమాచారం.