శరవణన్ ప్రధాన పాత్రలో నటించిన ‘సట్టముం నీతియుం’ సిరీస్ను ZEE5 తెలుగు ప్రేక్షకులకు అందించింది. 18 క్రియేటర్స్ బ్యానర్ మీద ఈ సిరీస్ను శశికళ ప్రభాకరణ్ నిర్మించారు. షో రన్నర్గా సూర్య ప్రతాప్. ఎస్ వ్యవహరించారు. బాలాజీ సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ తెలుగులో రీసెంట్గా స్ట్రీమింగ్ అయి మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ‘సట్టముమ్ నీతియుమ్’ సక్సెస్ మీట్ను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
శశికళ మాట్లాడుతూ .. ‘నిర్మాతగా ఇలా స్టేజ్ మీద మాట్లాడుతుండటం కొత్తగా ఉంది. యాంకర్గా ఎన్నో సార్లు మైక్ పట్టుకున్నా కూడా ఈ రోజు ఇలా కొత్తగా అనిపిస్తోంది. ఇదంతా కూడా నా భర్త ప్రభాకరణ్ వల్లే సాధ్యమైంది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ను ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్. తెలుగులోనూ ఈ సిరీస్ అద్భుతంగా దూసుకుపోతోంది. ఈ సిరీస్కు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. బాలాజీ గారు ఈ సిరీస్ను కేవలం 13 రోజుల్లోనే పూర్తి చేశారు. ఆయన వల్లే ఈ సిరీస్ ఇంత అద్భుతంగా వచ్చింది. ఆర్ట్ డైరెక్టర్ భావన మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. శరవణన్ సర్ ఈ సిరీస్కు బ్యాక్ బోన్లా నిల్చున్నారు. నమ్రత ప్రస్తుతం చాలా బిజీగా మారిపోయారు. ఈ సిరీస్లో అందరూ అద్భుతంగా నటించారు. నా భర్త ప్రభాకరణ్కు సిరీస్లు, సినిమాల పట్ల ఎంతో ప్యాషన్ ఉంటుంది. ఆయనకు ఈ ప్రాజెక్ట్ చాలా ప్రత్యేకం. ఈ సిరీస్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్కు థాంక్స్’ అని అన్నారు.