Maa Inti Bangaram: నా ఫ్యాన్స్ గర్వపడే సినిమా ఇది.. సామ్ కాన్ఫిడెంట్ స్టేట్మెంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) లీడ్ రోల్లో నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram). ‘ఓ బేబీ’ లాంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత సమంత – టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి (Nandini Reddy) కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్లో రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగిన ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి, ఆమె భర్త రాజ్ పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు (Introduction) ఇక్కడ చూద్దాం.
‘మా కోసం ఇక్కడికి తరలివచ్చిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తోంది. దర్శకురాలు నందినీ రెడ్డి, రాజ్ ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉంటారు. వారితో పని చేయడం అద్భుతమైన అనుభూతి. ఇప్పటివరకు వారితో నాకు ఎలాంటి చిన్న వాదన గానీ, చేదు అనుభవం గానీ ఎదురవ్వలేదు. ఈ సినిమాలో ప్రతి ఒక్క ఎమోషన్ ఉంది. యాక్షన్, డ్రామా, కామెడీ కలగలిసిన ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దయచేసి అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి. సమంత అభిమానులంతా ఖచ్చితంగా గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది’ అని సామ్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
డైరెక్టర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ‘సమంత రోజురోజుకూ ఒక నటిగా ఎదుగుతూనే ఉంది. ఆమె గత సినిమాలకు, ఈ నాటి నటనకు మధ్య చాలా వ్యూజ్ డిఫరెన్స్ ఉంది. సమంత ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, ఎమోషన్.. ఇలా ప్రతి సీన్లోనూ ఆమె అద్భుతంగా నటించింది. డైరెక్టర్గా కాకుండా, నేను కూడా ఒక ఫ్యాన్లా కళ్లప్పగించి ఆమె నటనను చూశాను. ఈ సినిమా అందరినీ అలరించే ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది” అని చెప్పారు. సమంత భర్త రాజ్ మాట్లాడుతూ..‘ ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ వినడానికి ఎంతో సాఫ్ట్గా, అనురాగం, ప్రేమతో కూడినదిగా అనిపిస్తుంది. కానీ, ఈ హోమ్లీ టైటిల్ వెనుక ఒక చీకటి కోణం, విపరీతమైన పగ దాగి ఉన్నాయి. సమంతకు, నందినికి మధ్య ఉన్న సాన్నిహిత్యం, బాండింగ్ అందరికీ తెలిసిందే. అందుకే ఈ కథకు నందినీ రెడ్డి అయితేనే పర్ఫెక్ట్ న్యాయం చేయగలదని మేము ఆమెను దర్శకురాలిగా ఎంపిక చేశాం’ అని వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?