హైదరాబాద్: తెలుగు తెరపైకి విలేజ్ బ్యాక్డ్రాప్లో రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన మూవీ ‘రోలుగుంట సూరి’. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో నాగార్జున పల్లా, ఇన్ఫ్లుఎన్సర్ ఆధ్యారెడ్డి, భావన నీలప్ హీరోహీరోయిన్లుగా తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై సౌమ్య చాందిని పల్లా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ తెలుగు ఫిలింఛాంబర్ లో ప్రీ రిలీజ్ కార్యకమాన్ని నిర్వహించింది.
దర్శకుడు అనిల్ కుమార్ పల్లా మాట్లాడుతూ – “ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రియల్ స్టిక్ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో సినిమాను అద్భుతంగా చేశారని అభినందించడం మా చిత్ర యూనిట్ కు కొత్త ఎనర్జీ వచ్చింది. మ్యూజిక్ పై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు లాంచ్ చేసిన మా సినిమాలోని పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనూప్ రూబెన్స్ గారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము. మా కృషిని, మా టీం టాలెంట్ను ఆయన ప్రత్యేకంగా అభినందించడం ఎంతో సంతోషంగా ఉంది. ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ మా సినిమా టీమ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రేక్షకులకు ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని భరోసా ఇచ్చారు. ఇక మా సినిమా హీరో నాగార్జున పల్లా అథ్లెటిక్స్ లో నేషనల్ గోల్డ్ మేడలిస్ట్. సినిమా రంగంలో మంచి ఫ్యూచర్ ఉందని మా సినిమాలో యాక్టింగ్ టాలెంట్ తో నిరూపించుకున్నాడు. ఈ నెల 14న విడుదల అయ్యే ‘రోలుగుంట సూరి’ సినిమాను థియేటర్ కు వెళ్లి చూడాలని ప్రతీ ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను” అని అన్నారు.