కాంతార చాప్టర్ వన్ తర్వాత రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడా అంటే ఇండస్ట్రీలో అవుననే టాక్ వినిపిస్తోంది. తనను అప్రోచ్ అవుతున్న నిర్మాతలు హ్యూజ్ అమౌంట్ చెప్పి స్ట్రోక్ తెప్పిస్తున్నాడట. ఒక్కో సినిమాకు రూ. 80 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడన్నది లెటేస్ట్ బజ్. కాంతార చాప్టర్ వన్కు చేసినట్లుగానే ప్రాఫిట్ షేర్ విధానంలో వర్క్ చేయాలని కోరగా.. నో చెబుతున్నాడట.
Also Read : Ustaad Bhagat singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఊగిసలాట.. అందుకేనా?
హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ .. రిషబ్తో జై హనుమాన్ ఎనౌన్స్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా జనవరి నుండి మొదలౌతుందని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు అప్డేట్ లేదు. రిషబ్ కూడా కాంతార చాప్టర్ వన్ సక్సెస్ ఎంజాయ్ మెంట్లో నుండి ఇంకా బయటకు రానట్లే కనిపిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఓ మూవీ కమిటయ్యాడు ఈ కన్నడ హీరో. ఈ ప్రాజెక్ట్ కూడా సెట్స్పైకి వెళ్లిన దాఖలాలు లేవు. ఇక్కడే కాదు.. హిందీలో ద ప్రైడ్ ఆఫ్ భారత్ః చత్రపతి శివాజీ మహారాజ్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి దాదాపు ఏడాది కావొస్తుంది. కానీ ప్రాజెక్ట్ కూడా ఎప్పుడు మొదలౌతుందో నో ఇన్ఫర్మేషన్. వీటికే ప్రోపర్ క్లారిటీ లేదు.. నెక్ట్స్ కేరళ ప్రముఖ రచయిత ఎం.టీ వాసుదేవన్ నాయర్ నవల రాండమూళంని సినిమా తెరకెక్కిస్తున్నారని, దానికి హీరో కమ్ దర్శకుడిగా రిషబ్ చేయబోతున్నాడన్న బజ్ నడుస్తోంది. మరి కాంతార హీరో ఏ సినిమా సెట్లోకి ఫస్ట్ అడుగుపెడతాడో లెట్స్ వెయిట్.
