నో పొలిటికల్ వార్! ఓన్లీ బాక్సాఫీస్ వార్!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ కు ఒకరంటే ఒకరి ఎంతో అభిమానం. కమల్ బాల నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెడితే, రజనీకాంత్ బస్ కండక్టర్ గా పనిచేస్తూ, యుక్తవయసులో వచ్చాడు. ఇద్దరూ ప్రముఖ దర్శకుడు బాలచందర్ శిష్యులు కావడంతో సహజంగానే వారి మధ్య గాఢానుబంధం ఏర్పడింది. కమల్ యూత్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ను మెప్పిస్తే, రజనీకాంత్ తనదైన బాడీ లాంగ్వేజ్ తో మాస్ గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించున్నాడు. కమల్ నాస్తికుడు, రజనీకాంత్ ఆస్తికుడు. అంతేకాదు… కాస్తంత టైమ్ దొరికితే చాలు హిమాలయాలకు వెళ్ళిపోయి, మానసిక ప్రశాంతతను పొందుతూ ఉంటాడు రజనీ. వ్యక్తిగత అభిరుచుల విషయంలోనూ వీరిద్దరి మధ్య చాలా వ్యత్యాసమే ఉంది. అయినా కానీ ఒకరంటే ఒకరికి బోలెడు ప్రేమ. తమిళనాడకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా కలిసి పోరాడతారు. తమ సంఘీభావాన్ని ప్రకటిస్తారు.
అలాంటి రజనీకాంత్, కమల్ హాసన్ మధ్య ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ జరుగుతుందని జనాలు భావించారు. కమల్ ఇప్పటికే పొలిటికల్ పార్టీ పెట్టగా, రజనీకాంత్ గత డిసెంబర్ లో పార్టీ పెడతాడని, ఈ ఎన్నికల్లో పోటీ చేసి, డీఎంకే, అన్నాడీఎంకే, కమల్ హాసన్ పార్టీలకు చుక్కలు చూపిస్తాడని అనుకున్నారు. కానీ అనారోగ్య కారణంగా రజనీ రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకున్నారు. దాంతో ఈ ఏప్రిల్ 6న పొలిటికల్ ఎరీనాలో రజనీ, కమల్ మధ్య జరగాల్సిన వార్ తప్పిపోయింది. కానీ ఈ యేడాది దీపావళికి మాత్రం వీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడే దాఖలాలు కనిపిస్తున్నాయి.
Also Read
రజనీకాంత్ అనారోగ్యానికి గురి కావడానికంటే ముందే ‘అన్నాత్తే’ చిత్రాన్ని మొదలెట్టాడు. కెమెరామేన్ శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపు కుంటోంది. ఈ సినిమా బ్యాలెన్స్ వర్క్ ను కూడా పూర్తి చేసి, దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయాలని అనుకుంటున్నారట. చిత్రం ఏమంటే… కమల్ హాసన్ కూడా తమిళనాడు ఎన్నికలకు ముందే ‘విక్రమ్’ అనే సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. అనివార్య కారణాల వల్ల అది ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకోలేకపోయింది. ‘మాస్టర్’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను వీలువెంబడి పూర్తి చేసి, దీపావళి కానుకగా విడుదల చేయాలని కమల్ హాసన్ భావించారు. సో… ఆ రకంగా ఇటు రజనీ, అటు కమల్ హాసన్ ఈ సారి దీపావళికి బాక్సాఫీస్ బరిలో అమీతుమీ తేల్చుకోవాలని అనుకుంటున్నారు. ఈ సీనియర్ స్టార్ హీరోలు ఇద్దరూ ఇలా థియేట్రికల్ వార్ కు దిగి దాదాపు 16 సంవత్సరాలు అవుతోంది. 2005లో రజనీకాంత్ ‘చంద్రముఖి’, కమల్ హాసన్ ‘ముంబై ఎక్స్ ప్రెస్’ ఒకే రోజున విడుదలయ్యాయి. అప్పుడు రజనీకాంత్ ది పై చేయి అయ్యింది. మరి ఈ సారి దీపావళికి ఎవరి సినిమా ఎక్కువ ప్రజాదరణ పొందుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
-
Trump-Iran: ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’.. ట్రంప్కు ఇరాన్ ఘాటు రిప్లై
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!