నో పొలిటికల్ వార్! ఓన్లీ బాక్సాఫీస్ వార్!!
కోలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ కు ఒకరంటే ఒకరి ఎంతో అభిమానం. కమల్ బాల నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెడితే, రజనీకాంత్ బస్ కండక్టర్ గా పనిచేస్తూ, యుక్తవయసులో వచ్చాడు. ఇద్దరూ ప్రముఖ దర్శకుడు బాలచందర్ శిష్యులు కావడంతో సహజంగానే వారి మధ్య గాఢానుబంధం ఏర్పడింది. కమల్ యూత్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ను మెప్పిస్తే, రజనీకాంత్ తనదైన బాడీ లాంగ్వేజ్ తో మాస్ గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించున్నాడు. కమల్ నాస్తికుడు, రజనీకాంత్ ఆస్తికుడు. అంతేకాదు… కాస్తంత టైమ్ దొరికితే చాలు హిమాలయాలకు వెళ్ళిపోయి, మానసిక ప్రశాంతతను పొందుతూ ఉంటాడు రజనీ. వ్యక్తిగత అభిరుచుల విషయంలోనూ వీరిద్దరి మధ్య చాలా వ్యత్యాసమే ఉంది. అయినా కానీ ఒకరంటే ఒకరికి బోలెడు ప్రేమ. తమిళనాడకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా కలిసి పోరాడతారు. తమ సంఘీభావాన్ని ప్రకటిస్తారు.
అలాంటి రజనీకాంత్, కమల్ హాసన్ మధ్య ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ జరుగుతుందని జనాలు భావించారు. కమల్ ఇప్పటికే పొలిటికల్ పార్టీ పెట్టగా, రజనీకాంత్ గత డిసెంబర్ లో పార్టీ పెడతాడని, ఈ ఎన్నికల్లో పోటీ చేసి, డీఎంకే, అన్నాడీఎంకే, కమల్ హాసన్ పార్టీలకు చుక్కలు చూపిస్తాడని అనుకున్నారు. కానీ అనారోగ్య కారణంగా రజనీ రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకున్నారు. దాంతో ఈ ఏప్రిల్ 6న పొలిటికల్ ఎరీనాలో రజనీ, కమల్ మధ్య జరగాల్సిన వార్ తప్పిపోయింది. కానీ ఈ యేడాది దీపావళికి మాత్రం వీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడే దాఖలాలు కనిపిస్తున్నాయి.
Also Read
- Adivi Sesh: "నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?" అన్నవారికి అడివి శేష్ షాకింగ్ రిప్లై!
- Thalaivar 173 : సూపర్ స్టార్ రజనీ వర్సెస్ డైరెక్టర్ శంకర్.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యే అప్డేట్!
- Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
- Raaka : దీపికా డెడికేషన్ కు యూనిట్ ఫిదా.. రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ
రజనీకాంత్ అనారోగ్యానికి గురి కావడానికంటే ముందే ‘అన్నాత్తే’ చిత్రాన్ని మొదలెట్టాడు. కెమెరామేన్ శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపు కుంటోంది. ఈ సినిమా బ్యాలెన్స్ వర్క్ ను కూడా పూర్తి చేసి, దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయాలని అనుకుంటున్నారట. చిత్రం ఏమంటే… కమల్ హాసన్ కూడా తమిళనాడు ఎన్నికలకు ముందే ‘విక్రమ్’ అనే సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. అనివార్య కారణాల వల్ల అది ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకోలేకపోయింది. ‘మాస్టర్’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను వీలువెంబడి పూర్తి చేసి, దీపావళి కానుకగా విడుదల చేయాలని కమల్ హాసన్ భావించారు. సో… ఆ రకంగా ఇటు రజనీ, అటు కమల్ హాసన్ ఈ సారి దీపావళికి బాక్సాఫీస్ బరిలో అమీతుమీ తేల్చుకోవాలని అనుకుంటున్నారు. ఈ సీనియర్ స్టార్ హీరోలు ఇద్దరూ ఇలా థియేట్రికల్ వార్ కు దిగి దాదాపు 16 సంవత్సరాలు అవుతోంది. 2005లో రజనీకాంత్ ‘చంద్రముఖి’, కమల్ హాసన్ ‘ముంబై ఎక్స్ ప్రెస్’ ఒకే రోజున విడుదలయ్యాయి. అప్పుడు రజనీకాంత్ ది పై చేయి అయ్యింది. మరి ఈ సారి దీపావళికి ఎవరి సినిమా ఎక్కువ ప్రజాదరణ పొందుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!