Raashi Khanna : ఎక్స్ పై రివెంజ్.. కర్మ ఎవరినీ వదలదు.. రాశిఖన్నా బ్రేకప్ స్టోరీ!
- అక్టోబర్ 17న రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'తెలుసు కదా' విడుదల..
- తన వ్యక్తిగత జీవిత రహస్యాలను పంచుకున్న ఈ ముద్దుగుమ్మ..
- నేను తప్పు చేయలేదు, ఇకపై కూడా చేయను. బాధ పడాల్సిన అవసరం లేదు: రాశీ ఖన్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raashii Khanna: సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’ విడుదల తేదీ దగ్గర పడుతోంది. నీరజ కోన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ రాశీ ఖన్నా ప్రేమ, బ్రేకప్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ‘తెలుసు కదా’ లవ్ స్టోరీ కావడంతో ప్రమోషన్స్లో రాశీ ఖన్నాను ప్రేమ గురించి ప్రశ్నించగా, ఆమె తన వ్యక్తిగత జీవిత రహస్యాలను పంచుకున్నారు. తాను తన జీవితంలో రెండు సార్లు ప్రేమలో ఉన్నానని రాశీ ఖన్నా వెల్లడించారు. “నేను సినీ రంగంలోకి రాకముందు ఒకసారి, ఆ తర్వాత మరోసారి ప్రేమలో పడ్డాను” అని తెలిపారు. అయితే, ప్రస్తుతం ఆ బంధాలు కొనసాగుతున్నాయా లేదా అనే విషయం మాత్రం తాను ఇప్పుడే చెప్పలేనని అన్నారు.
Read Also: Papikondalu Boat Tourism: పర్యాటకులకు గుడ్న్యూస్.. పాపి కొండల విహారయాత్ర మళ్లీ ప్రారంభం..
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- JanaNayagan : విజయ్ 'జననాయగన్'.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
- Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
- Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
ప్రేమకథలతో పాటు, బ్రేకప్ అనుభవాల గురించి కూడా రాశీ మాట్లాడారు. తన ‘ఎక్స్’ తో బ్రేకప్ అయిన తర్వాత తన స్నేహితులు అతనిపై ఏదైనా విధంగా రివెంజ్ తీర్చుకోమని సలహా ఇచ్చారని రాశీ తెలిపారు. అయితే, “నేను అలాంటిదాన్ని కాదు. అతని నుంచి నేను దూరం అయి ఉండొచ్చు. కానీ, అతనికి ఏదో చెడు జరగాలని కోరుకునే ఉద్దేశం నాకు లేదు. కర్మ ఎవరినీ వదలదు. నేను తప్పు చేయలేదు, ఇకపై కూడా చేయను. ఆ విషయంలో నేను బాధ పడాల్సిన అవసరం ఏమీ లేదు” అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చారు.
Read Also: AP Fake Liquor Case: ఏపీలో కల్తీ మద్యం కేసులో విస్తుబోయే నిజాలు బయటపెడుతున్న ఎక్సైజ్ శాఖ!
సినిమాల్లోకి వచ్చాక రాశీ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు ఆమె నిజ జీవిత ప్రేమ కథలు, బ్రేకప్స్పై మరింత చర్చకు దారి తీశాయి. సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..