విడుదలకు సిద్ధమైన ‘రైతన్న’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘రైతన్న’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆదివారం రైతు నాయకుల కోసం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో దీనిని ప్రదర్శించారు. ‘రైతన్న’ సినిమాను వీక్షించిన వారిలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోదండ రెడ్డి, సీపిఐ నాయకులు చాడా వెంకట్ రెడ్డి, సిపీఎం నాయకులు మధు, టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, ప్రజాకవి గద్దర్, ఎంఎల్సీసి గోరటి వెంకన్న, కవి అందెశ్రీ, రైతు నాయకులు వెంకట రామయ్య, మల్లారెడ్డి, గోవర్ధన్, రైతు సంఘం సాగర్, శ్రీమతి పద్మ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ, ”ఇందులోని పాటలను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, వంగపండు ప్రసాదరావు పాడారు. వారికి నా నివాళి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చెయ్యాలి అని చెబుతూ ‘రైతన్న’ సినిమా తీశాను. భారత దేశంలో సామాజికంగా వెనకబడిన కులం ఏదైనా వుంది అంటే అది రైతు కుటుంబమే. ఇవాళ రైతు పరిస్థితి ఏమిటి? రైతే దేశానికి వెన్నుముక, రైతే రాజు అనే నానుడి ఏమైంది? అన్నం పెట్టే అన్నదాత ఏ పొజిషన్ లో వున్నాడు? ఇదే ఈ సినిమాలో చూపించాం. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్స్ లను ఇంప్లిమెంట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వాటికి చట్ట బద్దత కలిపించిన నాడు రైతే రాజు. రైతే దేశానికి వెన్నుముక. అప్పుడు రైతు వృద్ధి లోకి వస్తాడు. అదే ‘రైతన్న’ సినిమా సారాంశం” అని అన్నారు.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
”భారత రైతాంగం ఏడు నెలల నుంచి వ్యవసాయ, విద్యుత్ చట్టాలపై పోరాడుతోందని, ఎంతో ధైర్యం చేసి నారాయణ మూర్తి ఈ సినిమా తీసినందుకు అభినందనలు తెలుపుతున్నా’నని వడ్డే శోభనాద్రీశ్వరరావు చెప్పారు. ‘అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టే కార్యక్రమం కేంద్రం చేస్తోంద’ని సిపీఎం నాయకుడు చాడా వెంకటరెడ్డి విమర్శించారు. ‘కేంద్రం తెచ్చిన వ్యవసాయ, విద్యుత్ చట్టాలను రద్దు చేయాల’ని గద్దర్ డిమాండ్ చేశారు. ఈ సినిమా ప్రజలలోకి వెళ్ళి వారిలో చైతన్యం తీసుకురావాలని ఆయన అభిప్రాయ పడ్డారు. ‘రైతన్న’ చిత్రం ద్వారా ప్రస్తుతం రైతులు పడుతున్న వెతలను నారాయణమూర్తి కళ్ళకు కట్టినట్టు చూపారని మిగిలిన వక్తలు ప్రశంసించారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?