లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు… పీవీపీ సెన్సేషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు’ అంటూ పివిపి సినిమా అధినేత, ప్రముఖ నిర్మాత, వ్యాపార వేత్త ప్రసాద్ వి పొట్లూరి తాజాగా చేసిన సెన్సేషనల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే… రైల్వే పాయింట్మ్యాన్ మయూర్ షెల్కే పేరు గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఏప్రిల్ 17న ముంబై సమీపంలోని వంగని స్టేషన్ వద్ద రైలు వస్తుండగానే పట్టాలపై పడిపోయిన ఆరేళ్ళ బాలుడు సాహిల్ షిర్సాత్ ను కాపాడాడు మయూర్. తన ప్రాణాలను పణంగా పెట్టి మయూర్ చేసిన సాహసానికి దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైల్వే మంత్రి పియూష్ గోయల్ మయూర్ కు రూ.50 కే అవార్డును ప్రకటించగా… మయూర్ తాను కాపాడిన బాలుడు సాహిల్ షిర్సాత్ కు రూ.25 వేలు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. సాహిల్ తల్లి దృష్టి లోపంతో బాధపడుతోందని, వారిది పేద కుటుంబమని, అందుకే ఆ బాలుడి భవిష్యత్ కోసం సగం డబ్బును విరాళంగా ఇవ్వాలని అనుకుంటున్నట్లు మయూర్ పేర్కొన్నాడు.
అయితే తాజాగా ప్రముఖ చలన చిత్ర నిర్మాత, వ్యవస్థాపకుడు ప్రసాద్ వి పొట్లూరి సోషల్ మీడియాలో మయూర్ షెల్కే ధైర్య సాహసాలను కొనియాడారు. అయితే మయూర్ ను ప్రశంసిస్తూ ‘రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు’ అంటూ పీవీపీ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ‘రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు… లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు, ఈ రియల్ హీరోకి జస్ట్ జావా బైక్.. హతవిధి! మనం చేసే కొంచమైనా… కొట్టే సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్ కి కొడదాం బ్రదర్స్’ అంటూ పీవీపీ ట్వీట్ చేశారు.
Also Read
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. 'వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు'!
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు 👍
లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు, ఈ రియల్ హీరోకి జస్ట్ Jawa బైక్.. హతవిధి!
మనం చేసే కొంచమైనా,కొట్టె సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్ కి కొడదాం బ్రదర్స్ 👍 pic.twitter.com/khkOY3O05F— PVP (@PrasadVPotluri) April 22, 2021
కాగా మయూర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 2016 లో రైల్వేలో పాయింట్స్మన్గా చేరాడు. తాజాగా అతని వెలుగులోకి వచ్చిన ధైర్యసాహసాలను మెచ్చిన ఒక కార్పొరేట్ సంస్థ అతనికి బైక్ ను బహుమతిగా ఇచ్చింది. మరికొంతమంది వ్యక్తులు, ఎన్జిఓలు కూడా అతనికి నగదు పురస్కారాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. కాని అతను డబ్బును ఆ నిరాకరించాడు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రజలు భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అందువల్ల అవసరమైన రోగుల చికిత్స కోసం ఆ డబ్బు ఇవ్వమని మయూర్ వారిని రిక్వెస్ట్ చేశాడు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!