లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు… పీవీపీ సెన్సేషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు’ అంటూ పివిపి సినిమా అధినేత, ప్రముఖ నిర్మాత, వ్యాపార వేత్త ప్రసాద్ వి పొట్లూరి తాజాగా చేసిన సెన్సేషనల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే… రైల్వే పాయింట్మ్యాన్ మయూర్ షెల్కే పేరు గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఏప్రిల్ 17న ముంబై సమీపంలోని వంగని స్టేషన్ వద్ద రైలు వస్తుండగానే పట్టాలపై పడిపోయిన ఆరేళ్ళ బాలుడు సాహిల్ షిర్సాత్ ను కాపాడాడు మయూర్. తన ప్రాణాలను పణంగా పెట్టి మయూర్ చేసిన సాహసానికి దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైల్వే మంత్రి పియూష్ గోయల్ మయూర్ కు రూ.50 కే అవార్డును ప్రకటించగా… మయూర్ తాను కాపాడిన బాలుడు సాహిల్ షిర్సాత్ కు రూ.25 వేలు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. సాహిల్ తల్లి దృష్టి లోపంతో బాధపడుతోందని, వారిది పేద కుటుంబమని, అందుకే ఆ బాలుడి భవిష్యత్ కోసం సగం డబ్బును విరాళంగా ఇవ్వాలని అనుకుంటున్నట్లు మయూర్ పేర్కొన్నాడు.
అయితే తాజాగా ప్రముఖ చలన చిత్ర నిర్మాత, వ్యవస్థాపకుడు ప్రసాద్ వి పొట్లూరి సోషల్ మీడియాలో మయూర్ షెల్కే ధైర్య సాహసాలను కొనియాడారు. అయితే మయూర్ ను ప్రశంసిస్తూ ‘రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు’ అంటూ పీవీపీ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ‘రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు… లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు, ఈ రియల్ హీరోకి జస్ట్ జావా బైక్.. హతవిధి! మనం చేసే కొంచమైనా… కొట్టే సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్ కి కొడదాం బ్రదర్స్’ అంటూ పీవీపీ ట్వీట్ చేశారు.
Also Read
- Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
- Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!"
- Maa Inti Bangaram : సమంత ‘గోల్డెన్ రన్’.. 17 లక్షలకు పైగా టికెట్లతో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్!
- NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు 👍
లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు, ఈ రియల్ హీరోకి జస్ట్ Jawa బైక్.. హతవిధి!
మనం చేసే కొంచమైనా,కొట్టె సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్ కి కొడదాం బ్రదర్స్ 👍 pic.twitter.com/khkOY3O05F— PVP (@PrasadVPotluri) April 22, 2021
కాగా మయూర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 2016 లో రైల్వేలో పాయింట్స్మన్గా చేరాడు. తాజాగా అతని వెలుగులోకి వచ్చిన ధైర్యసాహసాలను మెచ్చిన ఒక కార్పొరేట్ సంస్థ అతనికి బైక్ ను బహుమతిగా ఇచ్చింది. మరికొంతమంది వ్యక్తులు, ఎన్జిఓలు కూడా అతనికి నగదు పురస్కారాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. కాని అతను డబ్బును ఆ నిరాకరించాడు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రజలు భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అందువల్ల అవసరమైన రోగుల చికిత్స కోసం ఆ డబ్బు ఇవ్వమని మయూర్ వారిని రిక్వెస్ట్ చేశాడు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!