లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు… పీవీపీ సెన్సేషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు’ అంటూ పివిపి సినిమా అధినేత, ప్రముఖ నిర్మాత, వ్యాపార వేత్త ప్రసాద్ వి పొట్లూరి తాజాగా చేసిన సెన్సేషనల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే… రైల్వే పాయింట్మ్యాన్ మయూర్ షెల్కే పేరు గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఏప్రిల్ 17న ముంబై సమీపంలోని వంగని స్టేషన్ వద్ద రైలు వస్తుండగానే పట్టాలపై పడిపోయిన ఆరేళ్ళ బాలుడు సాహిల్ షిర్సాత్ ను కాపాడాడు మయూర్. తన ప్రాణాలను పణంగా పెట్టి మయూర్ చేసిన సాహసానికి దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైల్వే మంత్రి పియూష్ గోయల్ మయూర్ కు రూ.50 కే అవార్డును ప్రకటించగా… మయూర్ తాను కాపాడిన బాలుడు సాహిల్ షిర్సాత్ కు రూ.25 వేలు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. సాహిల్ తల్లి దృష్టి లోపంతో బాధపడుతోందని, వారిది పేద కుటుంబమని, అందుకే ఆ బాలుడి భవిష్యత్ కోసం సగం డబ్బును విరాళంగా ఇవ్వాలని అనుకుంటున్నట్లు మయూర్ పేర్కొన్నాడు.
అయితే తాజాగా ప్రముఖ చలన చిత్ర నిర్మాత, వ్యవస్థాపకుడు ప్రసాద్ వి పొట్లూరి సోషల్ మీడియాలో మయూర్ షెల్కే ధైర్య సాహసాలను కొనియాడారు. అయితే మయూర్ ను ప్రశంసిస్తూ ‘రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు’ అంటూ పీవీపీ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ‘రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు… లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు, ఈ రియల్ హీరోకి జస్ట్ జావా బైక్.. హతవిధి! మనం చేసే కొంచమైనా… కొట్టే సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్ కి కొడదాం బ్రదర్స్’ అంటూ పీవీపీ ట్వీట్ చేశారు.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు 👍
లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు, ఈ రియల్ హీరోకి జస్ట్ Jawa బైక్.. హతవిధి!
మనం చేసే కొంచమైనా,కొట్టె సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్ కి కొడదాం బ్రదర్స్ 👍 pic.twitter.com/khkOY3O05F— PVP (@PrasadVPotluri) April 22, 2021
కాగా మయూర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 2016 లో రైల్వేలో పాయింట్స్మన్గా చేరాడు. తాజాగా అతని వెలుగులోకి వచ్చిన ధైర్యసాహసాలను మెచ్చిన ఒక కార్పొరేట్ సంస్థ అతనికి బైక్ ను బహుమతిగా ఇచ్చింది. మరికొంతమంది వ్యక్తులు, ఎన్జిఓలు కూడా అతనికి నగదు పురస్కారాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. కాని అతను డబ్బును ఆ నిరాకరించాడు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రజలు భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అందువల్ల అవసరమైన రోగుల చికిత్స కోసం ఆ డబ్బు ఇవ్వమని మయూర్ వారిని రిక్వెస్ట్ చేశాడు.
తాజావార్తలు
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
-
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
-
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్షీట్
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!