Sunil Balusu: టాలీవుడ్ నిర్మాతలపై ఓటీటీ పెత్తనం.. యంగ్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కథానాయకుడి తల్లి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పాతో కలిసి నిర్మించారు. ఇంతకుముందు సునీల్ ‘ఓం భీమ్ బుష్’ (శ్రీ విష్ణు), ‘మా నాన్న సూపర్ హీరో’ (సుధీర్ బాబు) వంటి చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా సందర్భంగా సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పాతో జరిగిన సంభాషణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
Film Updates : విషు పండుగ కానుకగా తమిళ్, మలయాళ సినిమాల స్పెషల్ అప్డేట్స్
Also Read
- NTR - Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
- Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న 'ఇడుపు కాయితం'.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
- Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
- Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
సినిమా విడుదల తేదీల విషయంలో ఓటీటీల నుంచి ఎలాంటి ఒత్తిడి ఎదురవుతోందని సునీల్ అభిప్రాయపడ్డారు. అయన మాట్లాడుతూ తెలుగు సినిమాల మీద ఓటీటీల ప్రభావం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. విడుదల తేదీలను కూడా వారే నిర్ణయించే పరిస్థితి వచ్చింది. ఓటీటీలపై ఆధారపడి సినిమా తీస్తే నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు. వారు కొన్ని ఎంచుకున్న సినిమాలను మాత్రమే కొంటారు, తమ షెడ్యూల్కు అనుగుణంగా విడుదల చేయమని చెబుతారు. ఉదాహరణకు, వేసవి సీజన్లో విడుదల చేయకుండా నాలుగైదు నెలల తర్వాత రిలీజ్ చేయమంటే సినిమాకి ఉపయోగం ఏముంటుంది? ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ విషయంలో ఓటీటీలతో చర్చలు జరిగాయి, కానీ వారు చెప్పిన తేదీలకు కట్టుబడాలని నేను భావించలేదు. అందుకే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్మకుండా థియేటర్లలోనే మా సినిమాను విడుదల చేస్తున్నాం. థియేటర్లలో విజయం సాధించగలమనే నమ్మకం ఉంటేనే ఏ నిర్మాత అయినా సినిమా తీయాలి. ఓటీటీల మీద ఆధారపడటం సరికాదు అన్నారు. కొందరు నిర్మాతలు ఓటీటీలు ఆఫర్ చేసే డబ్బులకు ఆకర్షితులై నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని గురించి మీ అభిప్రాయం? అని అడిగితే ఓటీటీలు ఇచ్చే డబ్బు చాలా సందర్భాల్లో సరిపోదు. ఉదాహరణకు, సినిమా బడ్జెట్కు వడ్డీలు లెక్కేస్తే, వారు ఇచ్చే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. అది నిర్మాతలకు నష్టమే. థియేటర్లలో సినిమా హిట్ అయితే, ఓటీటీ గురించి ముందుగా ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ముందుగా సినిమాను ప్రేక్షకులకు చేర్చడంపై దృష్టి పెట్టాలి అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!