టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాస్, వ్యాపారవేత్త నితిన్ రాజును మే 31న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె వివాహంపై ఎలాంటి వార్తలు లేకుండానే సడెన్ గా జరిగిపోవడంతో అంత ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో ప్రణీత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై స్పందించారు. కరోనా పరిస్థితులు, ఆషాడం వల్ల తన పెళ్లి ఆడంబరంగా జరుపుకోలేకపోయానని కొత్త పెళ్లికూతురు ప్రణీత చెప్పుకొచ్చింది. తన కుటుంబం అన్ని సంప్రదాయాలను పాటిస్తుందని.. అందుకే ఆషాడ మాసం, దాని తర్వాత వచ్చే పరిణామాలపై అపనమ్మకంతో ఇరు కటుంబ సభ్యులు పెళ్లి వేడుకను నిర్వహించారని తెలిపింది. కొద్ది మంది బంధువుల సమక్షంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వివాహం జరిగిందని ప్రణీత చెప్పుకొచ్చింది.