DVV Entertainment: ట్విట్టర్లో కౌంటర్.. డీవీవీ నిర్మాణ సంస్థపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘OG’ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ పెట్టి పిటిషనర్ అడ్వకేట్ బర్ల మల్లేష్ యాదవ్ను కించపరిచినట్టు ఆయన ఆరోపణలు చేశాడు. ఈ ఘటనపై తీవ్రంగా తప్పుబట్టిన మల్లేష్ యాదవ్, ఆ సంస్థకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నోటీసులు పంపుతున్నానని, లీగల్ నోటీసులు జారీ చేస్తూ క్రిమినల్ కేసు నమోదు చేస్తానని హెచ్చరించారు.
Also Read:Shefali Jariwala: షెఫాలీ చనిపోయిన రోజు.. ఏం జరిగిందో నిజం బయటపెట్టిన భర్త పరాగ్
Also Read
- Wamiqa Gabbi: ఇంతకాలం ఎక్కడున్నావమ్మా.. ఒక్క సినిమాతో వామిక గబ్బికి ఫుల్ డిమాండ్!
- Venky Anil 5: 40 ఏళ్ల కెరీర్లో వెంకీ మామ కొత్త అవతార్.. లెఫ్టినెంట్ కల్నల్గా అదరగొట్టేశాడు!
- Venky Atluri: వెంకీ అట్లూరి నెక్ట్స్ మూవీస్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ‘పోలీస్’ కథ ఇంకా రాస్తున్నానంటూ రివీల్!
- George Krish: లాంచ్ రోజే శర్వానంద్ సెన్సేషన్.. ‘జార్జ్ క్రిష్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాక్!
పవన్ కల్యాణ్, ప్రియాంక మోహన్, ఎమ్రాన్ హష్మీలు ప్రధాన పాత్రలలో నటించిన ‘OG’ సినిమా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బానర్లో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మాణంలో సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కింది. సెప్టెంబర్ 19న తెలంగాణ ప్రభుత్వ హోం డిపార్ట్మెంట్ మెమో జారీ చేసి, స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ప్రీమియర్ షోలకు రూ.800 వరకు ధరలు ఉండవచ్చని పేర్కొంది. ఈ మెమోపై అడ్వకేట్ బర్ల మల్లేష్ యాదవ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఆర్డర్ చట్టవిరుద్ధమని, రాజ్యాంగం 14వ, 246వ విధులకు విరుద్ధమని వాదించారు. ఈ పిటిషన్ విచారించి, సెప్టెంబర్ 25న మెమోను సస్పెండ్ చేసి, ప్రభుత్వ, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్కు నోటీసులు జారీ చేశారు. తీర్పు తేదీ అక్టోబర్ 9కు ఆదేశించారు. దీనికి అసంతృప్తి చెందిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ డివిజన్ బెంచ్లో అప్పీల్ దాఖలు చేసింది.
Also Read:Raja Saab: రెబల్ ఫాన్స్ కి ముందుగానే పండుగ!
అక్కడ కూడా హైకోర్టు ఈ టికెట్ ధరల పెంపును తీవ్రంగా ఖండించింది. సెప్టెంబర్ 26న డివిజన్ బెంచ్ విచారణ సమయంలో హైకోర్టు తీర్పు రాత్రి 11:30 గంటల సమయంలో రావచ్చని తెలిసినప్పటికీ, అంతకు ముందే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తమ అధికారిక X ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్లో మల్లేష్ యాదవ్ను లక్ష్యంగా చేసుకుని, “నైజాం ఏరియాలో ఎక్కడైనా మల్లేష్ యాదవ్కు రూ.100కే ‘OG’ టికెట్ ఇస్తాము” అంటూ కామెంట్ చేశారు. ఈ పోస్ట్ వల్ల ట్రోలర్స్ తనని టార్గెట్ చేశారని మల్లేష్ యాదవ్ ఆరోపించాడు. హైకోర్టు తీర్పు ముందే ఇలా చేయడం కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించినది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు కంటెంప్ట్ కింద నోటీసులు పంపిస్తున్నాను. లీగల్ నోటీసులు జారీ చేస్తూ క్రిమినల్ కేసు నమోదు చేస్తాను” అంటూ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ajit Doval: “మా సహనాన్ని బలహీనతగా భావించొద్దు”.. అజిత్ దోవల్ మాస్ వార్నింగ్..
-
Indian Bowler: బుమ్రా లేని లోటు.. సిరాజ్తో కలిసి కొత్త బంతిని పంచుకునే ఆ ‘సీక్రెట్’ పేసర్ ఎవరు..?
-
Wamiqa Gabbi: ఇంతకాలం ఎక్కడున్నావమ్మా.. ఒక్క సినిమాతో వామిక గబ్బికి ఫుల్ డిమాండ్!
-
Attacks on Indians abroad: అమెరికా, యూకే, కెనడాల్లో భారతీయులపై పెరిగిన దాడులు..
-
Telangana Cabinet Decisions : రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు, సన్నాలకు బోనస్, ఈవీ ఆటోలకు భారీ సబ్సిడీ.!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!