DVV Entertainment: ట్విట్టర్లో కౌంటర్.. డీవీవీ నిర్మాణ సంస్థపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘OG’ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ పెట్టి పిటిషనర్ అడ్వకేట్ బర్ల మల్లేష్ యాదవ్ను కించపరిచినట్టు ఆయన ఆరోపణలు చేశాడు. ఈ ఘటనపై తీవ్రంగా తప్పుబట్టిన మల్లేష్ యాదవ్, ఆ సంస్థకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నోటీసులు పంపుతున్నానని, లీగల్ నోటీసులు జారీ చేస్తూ క్రిమినల్ కేసు నమోదు చేస్తానని హెచ్చరించారు.
Also Read:Shefali Jariwala: షెఫాలీ చనిపోయిన రోజు.. ఏం జరిగిందో నిజం బయటపెట్టిన భర్త పరాగ్
Also Read
పవన్ కల్యాణ్, ప్రియాంక మోహన్, ఎమ్రాన్ హష్మీలు ప్రధాన పాత్రలలో నటించిన ‘OG’ సినిమా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బానర్లో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మాణంలో సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కింది. సెప్టెంబర్ 19న తెలంగాణ ప్రభుత్వ హోం డిపార్ట్మెంట్ మెమో జారీ చేసి, స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ప్రీమియర్ షోలకు రూ.800 వరకు ధరలు ఉండవచ్చని పేర్కొంది. ఈ మెమోపై అడ్వకేట్ బర్ల మల్లేష్ యాదవ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఆర్డర్ చట్టవిరుద్ధమని, రాజ్యాంగం 14వ, 246వ విధులకు విరుద్ధమని వాదించారు. ఈ పిటిషన్ విచారించి, సెప్టెంబర్ 25న మెమోను సస్పెండ్ చేసి, ప్రభుత్వ, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్కు నోటీసులు జారీ చేశారు. తీర్పు తేదీ అక్టోబర్ 9కు ఆదేశించారు. దీనికి అసంతృప్తి చెందిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ డివిజన్ బెంచ్లో అప్పీల్ దాఖలు చేసింది.
Also Read:Raja Saab: రెబల్ ఫాన్స్ కి ముందుగానే పండుగ!
అక్కడ కూడా హైకోర్టు ఈ టికెట్ ధరల పెంపును తీవ్రంగా ఖండించింది. సెప్టెంబర్ 26న డివిజన్ బెంచ్ విచారణ సమయంలో హైకోర్టు తీర్పు రాత్రి 11:30 గంటల సమయంలో రావచ్చని తెలిసినప్పటికీ, అంతకు ముందే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తమ అధికారిక X ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్లో మల్లేష్ యాదవ్ను లక్ష్యంగా చేసుకుని, “నైజాం ఏరియాలో ఎక్కడైనా మల్లేష్ యాదవ్కు రూ.100కే ‘OG’ టికెట్ ఇస్తాము” అంటూ కామెంట్ చేశారు. ఈ పోస్ట్ వల్ల ట్రోలర్స్ తనని టార్గెట్ చేశారని మల్లేష్ యాదవ్ ఆరోపించాడు. హైకోర్టు తీర్పు ముందే ఇలా చేయడం కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించినది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు కంటెంప్ట్ కింద నోటీసులు పంపిస్తున్నాను. లీగల్ నోటీసులు జారీ చేస్తూ క్రిమినల్ కేసు నమోదు చేస్తాను” అంటూ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
RaviMohan : జయంరవి చెప్పిన మూడక్షరాల ఇడ్లి నటి ఆమేనా?
-
CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
-
International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
-
Ajinkya Rahane: యాహూ మాకు రెండు పాయింట్లు వచ్చాయి.. కేకేఆర్ విజయంపై రహానే సంతోషం!
-
Peddi : “బడ్జెట్ హద్దులు దాటలేదు”.. ‘పెద్ది’పై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..