Pawan Kalyan : సజ్జనార్ కు పవన్ అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా పరిశ్రమకు శాపంగా మారిన పైరసీ ముఠాపై హైదరాబాద్ పోలీసులు సాధించిన విజయం యావత్ భారతీయ సినీ రంగానికి ఊరటనిచ్చింది అని పవన్ కళ్యాణ్ అన్నారు. డబ్బుల రూపంలోనే కాక, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించిన సినిమాలు విడుదలైన రోజునే ఇంటర్నెట్లో పోస్ట్ అవుతుండటం వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్న తరుణంలో, ఈ కట్టడి చర్యలు స్వాగతించదగినవని ఆయన అన్నారు.
Also Read :Mega Star : ఐ – బొమ్మ వాళ్లు సవాళ్లు విసురుతుంటే తట్టుకోలేకపోయా
Also Read
- Chandini Chowdary: "ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!" అంటే ఆయన ముఖం మాడిపోయింది!
- Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
- Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
- Tollywood: ఫేక్ హౌస్ఫుల్స్... డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త "మైండ్ గేమ్"!
సినిమా విడుదలను ఒక మహా యజ్ఞంగా భావించే దర్శకనిర్మాతలకు పైరసీ ముఠాలను అరికట్టడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో, పైరసీకి కీలక కేంద్రాలుగా ఉన్న ఐబొమ్మ (iBomma), బప్పమ్ (Bappam) వెబ్సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, అతని చేతనే వాటిని మూసివేయించడం ఒక చారిత్రక ఘట్టం అని పవన్ అన్నారు. పోలీసులకే సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు చేరుకున్న తరుణంలో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు బృందం చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతమైంది**. ఈ సందర్భంగా, ఈ ఆపరేషన్లో భాగమైన పోలీసులకు, అలాగే సిటీ కమిషనర్ సజ్జనార్ కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
Also Read :Nagarjuna: అక్కినేని నాగార్జున ఇంట్లో డిజిటల్ అరెస్ట్ అయిందెవరు?
సజ్జనార్ నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు, యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. సజ్జనార్ కేవలం సినిమా పైరసీపైనే కాకుండా, బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ వంటి వాటిపై కూడా ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయం. ఈ మోసాల వల్ల ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా చితికిపోతున్నారో చైతన్యపరుస్తున్నారని పవన్ తెలిపారు. పొంజీ స్కీమ్స్ మూలంగా ప్రజలు ఆర్థికంగా మోసానికి గురై నష్టపోతున్న విధానాన్ని సజ్జనార్ ఒక సందర్భంలో వివరించారని ఆయన గుర్తు చేశారు. అలాగే, బెట్టింగ్ యాప్స్ను నియంత్రించేందుకు శ్రీ సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం **అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకువచ్చింద**ని శ్రీ పవన్ కళ్యాణ్ కొనియాడారు.
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!