వెండితెరపై ఎన్నో సార్లు దృశ్యరూపం దాల్చాల్సిన ఇతిహాసం రామాయణం మరోసారి రిలీజ్కు సిద్ధమైంది. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’ రూపొందింది. సినిమా ట్రైలర్ను బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేశారు. పాన్ వరల్డ్గా రిలీజ్ అవుతున్న ‘రామాయణం’ ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లో డబ్ కావడం విశేషం. బాలీవుడే కాదు ఇండియన్ సినీ లవర్స్ను ‘రామాయణం’ చాలా కాలంగా ఊరిస్తోంది. ఒక్కో పార్ట్ పై 2000 కోట్లు ఖర్చు పెట్టారని, రెండు పార్ట్ల బడ్జెట్ 4000 కోట్లు అంటూ హైప్ క్రియేట్ చేశారు. విఎఫ్ఎక్స్ విజువల్స్ సినిమా నిండా పరిచినా ఇంత ఖర్చు అవుతుందా అన్న డౌట్ కు ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. విజువల్ వండర్ గా తీశాడు దర్శకుడు నితీష్ తివారీ.
రామాయణం నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమా పై అంచనాలను తగ్గించేసింది. రామాయణం తెలిసిన సగటు ప్రేక్షకులు ఎంతో ఊహించుకోగా ఎక్స్పెక్టేషన్స్ను రీచ్ కాలేకపోయింది. ఇలా నిరాశపరిచిన సినీ లవర్స్కు ట్రైలర్ ఊపిరిపోసింది. రావణాసురుడిగా నటించిన యష్ సీన్స్ తో మొదలైన ట్రైలర్ హైప్ తీసుకొచ్చింది. రాముడిగా రణ్బీర్ అందగాడిగా, సౌమ్యుడిగా కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. సీతగా నటించిన సాయి పల్లవి బాగుందని కొందరు అంటుంటే, చిన్న పిల్లగా ఉందని, ఓన్ వాయిస్ కాకుండా డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
రామాయణంలో అందరూ ఎదురుచూసే హనుమాన్ను నాలుగు నిమిషాల ట్రైలర్లో చూపించకపోవడం షాక్ ఇచ్చింది. సినిమాకు హన్స్ జిమ్మర్తో పాటు ఏ.ఆర్. రెహమాన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. విజువల్స్ను ఎలివేట్ చేసేలా మ్యూజిక్ ఉంది. కొన్ని యాక్షన్ సీన్స్, విఎఫ్ఎక్స్లో జంతువులను చూస్తుంటే ‘ఆదిపురుష్’ గుర్తు చేసినా, ఓవరాల్గా ఆకట్టుకున్నాడు దర్శకుడు. రిలీజ్ డేట్ ఇవ్వకపోయినా దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

