చిత్ర నిర్మాణంలో దూసుకుపోతున్న నారాయణ దాస్ నారంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పంపిణీ దారుడు, నిర్మాత, ఎగ్జిబిటర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్ టాలీవుడ్ లో నిర్మాతగా తన పట్టు బిగిస్తున్నారు. దాదాపు పది చిత్రాల నిర్మాణానికి ఆయన పూనుకున్నారు. కొన్ని సినిమాలను ఆయన సొంతంగానూ, మరి కొన్ని సినిమాలను భాగస్వాములతోనూ కలిసి నిర్మాణం జరుపుతున్నారు. విశేషం ఏమంటే… చిత్ర నిర్మాణంలో రాజీ పడకపోవడం తన నైజం అని తొలి చిత్రం ‘లవ్ స్టోరీ’తోనే నిరూపించారు నారాయణ్ దాస్ నారంగ్. పూర్తిగా కొత్త వాళ్ళతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాను ప్రారంభించిన ఆయన… అవుట్ పుట్ అనుకున్న విధంగా రాకపోవడంతో దాన్ని పక్కన పెట్టి, నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లోనే ‘లవ్ స్టోరీ’ని నిర్మించారు. ఈ సినిమా తుదిమెరుగులు దిద్దుకుంటోంది.
Read Also : ‘రాధేశ్యామ్’ తేదీకి వస్తున్న ఆ ఐదు చిత్రాలు!
Also Read
- Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
- Karikala First Look: సందీప్ కిషన్ 'కరికాల' ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
- Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
- Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్... ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన 'ఇచ్ఛాధారి నాగిన్'..
ఇదిలా ఉంటే… ఇప్పుడు నాగచైతన్య తండ్రి నాగార్జునతో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీని నిర్మిస్తున్నారు. దీనితో పాటు శరత్ మరార్ తో కలిసి నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో ‘లక్ష్య’ చిత్రాన్ని నిర్మించారు నారాయణ దాస్ నారంగ్. ఈ సినిమా కూడా తుదిమెరుగుల్లో ఉంది. ఇక సుధీర్ బాబు హీరోగా, ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్థన్ తో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ మూవీ అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. దీనితో పాటు తమిళ స్టార్ హీరో ధనుష్ తో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్రిభాషా చిత్రాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఇవి కాకుండా నిఖిల్ 20వ చిత్రాన్ని తామే నిర్మిస్తున్నట్టు ఇప్పటికే నారాయణదాస్ నారంగ్ తెలిపారు. అలానే ‘మేజర్’లో నటిస్తున్న అడివి శేష్, శర్వానంద్, తమిళ నటుడు శివకార్తికేయన్ లతో కూడా వీలువెంబడి సినిమాలను నిర్మించబోతున్నారు ఈ సీనియర్ ఫిల్మ్ పర్సనాలిటీ! ఇప్పటికే తెలంగాణలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న నారాయణ దాస్ నారంగ్, ఆయన తనయుడు సునీల్ నారంగ్… మహేశ్ బాబుతో కలిసి ఎ.ఎం.బి. మల్టీప్లెక్స్ ను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో వందల థియేటర్ల నిర్వహణ కూడా నారాయణదాస్ నారంగ్ చేతిలోనే ఉండటం విశేషం. ఈ రకంగా తెలుగు సినిమా రంగంలోని ప్రధాన శాఖల్లో ఏషియన్ ఫిలిమ్స్, ఎస్వీసీసీ ప్రొడక్షన్ హౌస్ తమ సత్తాను చాటుతున్నాయి.
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!