ZEE5 గ్రామీణ తెలంగాణ ప్రాంతంలోని మూలాల్ని ప్రతిబింబించేలా ‘మోతెవరి లవ్ స్టోరీ’ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చింది. ఇందులో అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 8న ప్రీమియర్ అయిన ఈ సిరీస్ సంచలనాత్మక స్పందనను దక్కించుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే 2,00,000 మందికి పైగా వీక్షకులను ఆకర్షించింది. శివ కృష్ణ బుర్రా రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో మురళీధర్, సదన్న, విజయ లక్ష్మి, సుజాత ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. మధుర ఎంటర్టైన్మెంట్, మై విలేజ్ షో బ్యానర్లపై మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ ‘మోతెవరి లవ్ స్టోరీ’ని నిర్మించారు.
Also Read : Tollywood : ప్రొడ్యూసర్స్.. ఎందుకీ రెండు నాల్కల ధోరణి?
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ‘మోతెవరి లవ్ స్టోరీ’ ఆరెపల్లి గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊర్లోని పర్షి (అనిల్ గీలా) అనే యువకుడి చుట్టూ కథ నడుస్తుంది. అతను సత్తయ్య (మురళీధర్ గౌడ్) కుమార్తె అనిత (వర్షిణి)తో ప్రేమలో పడతాడు. కానీ సత్తయ్య, అతని సోదరుడు నర్సింగ్ (సదన్న) తమ దివంగత తండ్రి రాసిన ఓ వీలునామాను బయటపడటం, దీంతో ఓ భూ వివాదం చెలరేగడం.. ఇక దీంతో హాస్యం, భావోద్వేగాలు పుట్టుకు రావడం, చివరకు ఊహించని మలుపులకు దారి తీయడం జరుగుతుంది. విడుదలైనప్పటి నుండి ఈ సిరీస్ గ్రామీణ ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ZEE5 లోని ట్రెండింగ్ చార్టులలో ఈ సిరీస్ అగ్రస్థానంలో నిలిచింది. 3 రోజుల్లో 2,00,000లకు పైగా వీక్షకులను ఆకర్షించి కొద్ది కాలంలోనే ‘మోతెవరి లవ్ స్టోరీ’ తెలుగు రాష్ట్రాలలోని అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ఉంది.