Mirai : మిరాయ్ పోస్ట్ పోన్.. ఇన్ సైడ్ స్టోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనుమాన్ సినిమాతో ఫ్యాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న తేజా, ఇప్పుడు మిరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. నిజానికి, ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది, కానీ ఈ సినిమా ఒక వారం వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా అధికారిక సమాచారం రాలేదు, కానీ సెప్టెంబర్ 12వ తేదీన సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని 28వ తేదీన రిలీజ్ చేయబోతున్న ట్రైలర్తో పాటు ప్రకటించనున్నారు.
Also Read: Kollywood : స్టార్ హీరో నిర్మాణ సంస్థ లాంఛ్ కు కదిలొచ్చిన స్టార్స్
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
ఆ సంగతి అలా ఉంచితే, అసలు ఈ సినిమా వాయిదా పడడానికి గల కారణాలు ఏమిటనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా, ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అదేమిటంటే, ఈ సినిమా పూర్తిగా కంప్యూటర్ గ్రాఫిక్స్ బేస్డ్ సినిమా. సినిమాలో సింహభాగం కంప్యూటర్ గ్రాఫిక్స్పై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఈ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ అవుట్పుట్ సెప్టెంబర్ 1వ తేదీ నాటికి రెడీ అవుతుందని అంచనా వేసినప్పటికీ, ఒకవేళ వాటిలో ఏమైనా కరెక్షన్స్ చేయాల్సి వస్తే, అప్పటికప్పుడు చేసి 5వ తేదీ లోపు రిలీజ్ చేయడం కష్టం కాబట్టి, కాస్త సమయం తీసుకునేందుకు సెప్టెంబర్ 12వ తేదీన ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం