Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manoj Manchu: మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మనోజ్ మంచు, ఆయన భార్య మౌనిక భూమా మంచు సరికొత్త సేవా విప్లవానికి శ్రీకారం చుట్టారు. సమాజ సేవ కోసం “ఐక్య ధైర్య సేన సమితి” అనే సరికొత్త సామాజిక సేవా సంస్థను వీరు అధికారికంగా ప్రారంభించారు. కూకట్పల్లిలో మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరం ప్రత్యేక సభలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సంస్థ పేరును అధికారికంగా ప్రకటించారు.
ఐదుగురు పిల్లల దత్తత.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సేవా కార్యక్రమాల విస్తరణ
ఈ సందర్భంగా సభలో మంచు మనోజ్ మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుంచి సేవ చేయడం అనేది నేను, నా భార్య మౌనిక మా పెద్దల నుంచి నేర్చుకున్నాం. సమాజం కోసం పని చేయాలనుకునే వారందరికీ ఒకే వేదిక ఉండాలనే ఉద్దేశంతో మౌనిక ఆలోచనల నుంచి పుట్టిందే ఈ ‘ఐక్య ధైర్య సేన సమితి’. ఈ రోజు నుంచే ఐదుగురు అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి పూర్తి చదువు బాధ్యతలను మేము స్వీకరిస్తున్నాం. ఈ సేవా కార్యక్రమాలు ఇక్కడితో ఆగవు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామానికి ఈ సమితిని విస్తరిస్తాం” అని ప్రకటించారు.
Also Read
- Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
- Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
- Anantha Sriram: "విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి 'పెద్ది' బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్డాగ్' టీజర్!
మౌనిక భూమా మంచు మాట్లాడుతూ.. ఈ ట్రస్ట్ కేవలం రక్తదానాలకే పరిమితం కాదని స్పష్టం చేశారు. మహిళా సాధికారత, ఉపాధి కల్పనపై ప్రధానంగా దృష్టి పెడతామన్నారు. ‘నమస్తే వరల్డ్’ అనే సంస్థ ద్వారా మహిళలకు ‘టాయ్ మేకింగ్’ (బొమ్మల తయారీ) కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి, వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. తమ పెద్దల ఆశీస్సులతో ప్రారంభమైన ఈ ప్రయాణానికి అందరి మద్దతు కావాలని కోరారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. మంచు కుటుంబంతో తమకు 30 ఏళ్ల అనుబంధం ఉందని, మనోజ్ హృదయం ఎప్పుడూ సమాజం కోసమే ఆలోచిస్తుందని కొనియాడారు. ఈ ట్రస్ట్కు తన వంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
మంచు మనోజ్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల రిలీజ్ అయిన ‘మిరాయి’ చిత్రంలో మనోజ్ ‘మహాబీర్ లామా’ (బ్లాక్ స్వోర్డ్) పాత్రలో తన నటనా విశ్వరూపాన్ని ప్రేక్షకులకు రుచి చూపించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’. 1897 – 1920 బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో హనుమ రెడ్డి యక్కంటి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో ఇంటర్నేషనల్ యాక్ట్రెస్ మారియా ర్యాబోషప్కా హీరోయిన్గా నటిస్తోంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!