Manchu Lakshmi : దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా జరిగిన హ్మదాబాద్లో ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన వందలాది కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని నింపింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో 265 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆ సంఖ్య ఇప్పుడు 274 కు చేరింది . ఇక ఈ ప్రమాదం పై సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ ప్రమాదం నుంచి మంచు లక్ష్మి తృటిలో తప్పించుకున్నట్లు తెలిసింది..
Also Read : Kalpika : సినీ నటి కల్పికపై మరో కేసు నమోదు
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
- Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'
అయితే ఈ విమానం కూలిన రోజు మంచు లక్ష్మి కూడా లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్లోనే ప్రయాణించారట. అదృష్టవశాత్తూ ఆమె ముంబై నుంచి వెళ్లే ఫ్లైట్ ఎక్కడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తన ఎక్స్ వేదికగా తెలిపారు.. ‘ అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన రోజు నేను, మా అమ్మాయి ముంబై నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ప్రయాణించాం. దేవుడి దయవల్ల మేము క్షేమంగా లండన్ చేరుకున్నాం. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్రమాదం గురించి తెలిసి షాక్కి గురయ్యాను. ఈ దుర్ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇది నిజంగా బాధాకరం. ఈ ప్రమాదంలో విద్యార్థులు, వైద్యులు మృతి చెందారని తెలిసి నా హృదయం ముక్కలైంది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మన ప్రాణాలు క్షణంలో ముగిసిపోతాయనడానికి ఈ ప్రమాదమే ఓ ఉదాహరణ. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని మంచు లక్ష్మి తెలిపింది.
- Tags
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!