మలయాళ చిత్రపరిశ్రమలోనే కాదు, యావత్ భారత చలనచిత్ర రంగంలోనే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్గా నిలిచిన బిగ్గెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పేట్రియాట్’ (Patriot). మలయాళ సినీ దిగ్గజాలు, లెజెండరీ నటులు మమ్ముట్టి (Mammootty), మోహన్లాల్ (Mohanlal) సుమారు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలిసి నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని..‘టేకాఫ్’, ‘మాలిక్’ వంటి క్లాసిక్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు మహేష్ నారాయణన్ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. గూఢచర్యం, రాజకీయాలు, అత్యాధునిక టెక్నాలజీ, హ్యూమన్ ఎమోషన్స్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ చిత్రం.. నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్కు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా.. రాబోయే జూన్ 5వ తేదీ నుండి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఒకేసారి ఐదు భాషల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. జూన్ 5 నుంచి మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. అధికారం ఆధారంగా నడిచే ప్రస్తుత వ్యవస్థలో, నియంత్రణ లేని ‘ప్రభుత్వ నిఘా’ (Surveillance) సాధారణ ప్రజల ప్రైవసీకి ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ సినిమాలో చూపించారు.తాను సృష్టించిన వ్యవస్థే ప్రజల పాలిట శాపంగా మారిందని గ్రహించిన ఆ వ్యక్తి.. దానికి ఎదురు తిరుగుతాడు.
ఈ క్రమంలో తను నిజాన్ని బయటపెట్టడం దేశద్రోహమా? లేక నిజమైన దేశభక్తి చర్యనా? అనే ప్రశ్నలతో అతను చేసే పోరాటమే ఈ సినిమా. దేశభక్తికి, దేశద్రోహానికి మధ్య ఉన్న సన్నని గీతను దర్శకుడు ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారు. కేవలం మమ్ముట్టి, మోహన్లాల్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఇండియన్ సినిమా టాప్ స్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. లేడీ సూపర్స్టార్ నయనతార, వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్, కుంచాకో బొబన్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ హై-వోల్టేజ్ డ్రామా, గ్రిప్పింగ్ స్క్రీన్ప్లేతో ఇంటెన్సివ్ విజువల్ వండర్గా రాబోతున్న ‘పేట్రియాట్’ సినిమాను వచ్చే నెల జూన్ 5 నుండి మీ జీ5 యాప్లో వీక్షించడం అస్సలు మిస్ అవ్వకండి!
