ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్తో దూసుకెళ్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ కథతో సంబంధం లేకుండా, ఈ సినిమాలోని కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మొదటి భాగానికి మించిన అల్లరి చేసి ఆకట్టుకున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ముక్యంగా ఎక్కడా బోర్ కొట్టకుండా సన్నివేశాలు ఉండటం ఈ సినిమా ప్లస్ పాయింట్. ఎలాంటి అంచనాలు లేకుండా.. యూత్ ఫుల్ కామెడీ మూవీని ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటింది. కేవలం యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ కూడా మ్యాడ్ స్క్వేర్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read: Puri Jagannadh: విజయ్ సేతుపతి పై ఫుల్ ఫైర్ అవుతున్న తమిళ ఆడియన్స్..
దీంతో ఈ మూవీ దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్కు చేరుకుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఇక తాజాగా ఈ సినిమాకు ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణతో ఈ మూవీ సక్సెస్ మీట్ను ఏప్రిల్ 4న ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. కాగా, ఈ సక్సెస్ మీట్ ఈవెంట్కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ గెస్ట్గా రాబోతున్నాడట. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి, ఈ సక్సెస్ మీట్పై ఎన్టీఆర్ ఫ్యాన్స్లోనూ ఆసక్తి మొదలైంది.