మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినట్లు తాజా సమాచారం వెలువడింది. వైద్యుల పర్యవేక్షణలో తగిన విశ్రాంతి తీసుకుంటున్న తారక్, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని వైద్య వర్గాలు తెలిపాయి. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
శస్త్రచికిత్స అనంతరం తగిన రికవరీ పీరియడ్ తర్వాత, తారక్ ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుండి తన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ షూటింగ్లో తిరిగి పాల్గొననున్నారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ మీద భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెట్స్ పైకి తిరిగి వెళ్లేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. గత నెల 27న జూనియర్ ఎన్టీఆర్ భుజంకి గాయమైనట్టు ఆయన ఆఫీస్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక ఇప్పుడు ఈరోజు కిమ్స్ లోని స్పెషలిస్ట్ డాక్టర్స్ టీం ఈ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసింది.

