బాలీవుడ్ స్టార్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘ధడక్’ మూవీతో అడుగు పెట్టి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది జాన్వీ. తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసినప్పటికి.. పాపులారిటి.. ఫేమ్ అయితే వచ్చింది కానీ, కెరీర్ లో అనుకున్నంతగా గట్టి హిట్ మాత్రం పడలేదు. కానీ అతిలోక సుందరి వారసురాలిగా దక్షిణాదీతో తొలి చిత్రం ‘దేవర’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్, ఎన్టీఆర్ సరసన తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో తెలుగులో మరో రెండు బడా ప్రాజెక్టులు నటిస్తుంది జాన్వీ కపూర్. అయితే తాజాగా ఇప్పుడు ఈ అమ్మడు మరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది..
అవును సమాచారం ప్రకారం జాన్వీ తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోందట. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ జాన్వీ కపూర్తో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ సామాజిక అంశాలపై నడుస్తుందని తెలుస్తోంది. దీంతో ఈ వెబ్ సిరీస్లో జాన్వీ పాత్ర అల్టిమేట్గా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్ లో అణచివేత, సామాజిక సమస్యలే ప్రధాన కథాంశంగా ఉండనున్నాయి. జులైలో షూటింగ్ పనులు మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా జాన్వీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.