Janhvi Kapoor: శ్రీదేవి పుట్టినరోజు.. తిరుమలలో ప్రియుడితో కలిసి మోకాళ్లపై జాన్వీ సాష్టాంగ నమస్కారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor Visits Tirumala With Boyfriend Shikhar Pahariya: ఆగస్ట్ 13, మంగళవారం అతిలోక సుందరి, నటి శ్రీదేవి పుట్టిన రోజు. దివంగత నటికి అభిమానులు నివాళులు అర్పిస్తూ ఉండగా, ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా జాన్వీ కపూర్ తిరుమల తిరుపతి ఆలయానికి చేరుకున్నారు. ఆమె ప్రతి సంవత్సరం తన తల్లి పుట్టినరోజున తిరుమలకి వస్తుంటుంది. ఈరోజు కూడా పసుపు రంగు చీర మరియు ఆకుపచ్చ సాంప్రదాయ బ్లౌజ్ ధరించిన జాన్వీ ఇక్కడి ఆలయంలో ప్రార్థనలు చేసింది. ఈ సమయంలో, జాన్వీ రూమర్ద్ లవర్ శిఖర్ పహాడియా కూడా ఆమెతో ఉన్నాడు. జాన్వీ తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఒక మెమరబుల్ పోస్ట్ చేసింది. ఇక ఆమె ఆలయ సందర్శన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పసుపు పట్టు చీరలో దక్షిణ భారత సంప్రదాయ ఆభరణాలతో అలంకరించబడింది.
Also Read
- Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
- Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
- Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
- Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
శిఖర్ పహాడియా కూడా ఆమె వెంటే కనిపించాడు. శిఖర్ కూడా దక్షిణ భారత సంప్రదాయ దుస్తులైన పంచెకట్టుతో కనిపించాడు. ఇద్దరూ కూడా ఆలయంలో మోకరిల్లి, వెంకన్న ఆశీస్సులు తీసుకుంటూ కనిపించారు. ఇక జాన్వీ తన తిరుపతి పర్యటన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అందులో ఒకదానిలో గుడి మెట్లు కనిపిస్తూ ఉండడంతో ఆమె కాలినడకన వెళ్లినట్టు తెలుస్తోంది. జాన్వీ కపూర్ గత కొన్నేళ్లుగా తాను తిరుపతి ఆలయాన్ని ఎందుకు ఎక్కువగా సందర్శిస్తున్నానో అనేక సంధర్భాల్లో చెప్పింది. ‘గత 5-6 ఏళ్లలో ఆధ్యాత్మికత పట్ల నాకు శ్రద్ధ పెరిగింది. నేను నా మతం, నా ఆధ్యాత్మికత ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఆశ్రయం పొందుతున్నాను. ఎప్పుడు ఆయన పిలిచినా తిరుపతి చేరుకుంటా, గుడి మెట్లు ఎక్కి ఆయన్ని దర్శనం చేసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది అని ఆమె పేర్కొంది.
తాజావార్తలు
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
-
US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!