NTV Telugu Site icon

Kollywood : రానున్న రెండు సినిమాలు హిట్ అవ్వకుంటే ఆ నిర్మాత అంతే సంగతులు

Untitled Design (9)

Untitled Design (9)

ఇటీవల కాలంలో తమిళ్ నుండి భారీ బడ్జెట్ చిత్రాలు వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన భారతీయుడు -2 ను అత్యంత భారీ స్థాయిలో నిర్మించింది లైకా మూవీస్. ఎంత నష్టం వచ్చింది అనేది పక్కన పెడితే ఖర్చుకు వెనుకాడకండా సినిమాలు చేస్తుంది లైకా. కోలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ లు చాలనే ఉన్నాయి. లైకా మాదిరి ‘స్టూడియో గ్రీన్’ నిర్మాణ సంస్థ తమిళ్ లో రెండు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోంది.

విక్రమ్ హీరోగా రానున్న తంగలాన్ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ నిర్మిస్తోంది. పా. రంజిత్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే కానుకగా తమిళ్ తో పాటు పాన్ ఇండియా బాషలలో విడుదల కానుంది. ఇక మరొక తమిళ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువ’.శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 300 కోట్ల రూపాయలతో తీరికెక్కింది. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రం ఫై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కంగువ రెండు భాగాలుగా రానున్నట్టు దర్శకుడు శివ ఇటీవల తెలిపాడు. మరోవైపు టాలివుడ్ హీరో అల్లు శిరీష్ హీరోగా రానున్న బడ్డీ చిత్రాన్నిస్టూడియో గ్రీన్ నిర్మిస్తుంది. అనుకోని కారణాల వలనఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్ గా ఆగస్టు 2న విడుదల కానుంది బడ్డీ. ఈ మూడు చిత్రాల రిజల్ట్స్టూడియో గ్రీన్ కు చాలా కీలకం. ఏమాత్రం అటుఇటు అయినా జ్ఞానవేల్ రాజాకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.

Also  Read : Dhanush: బిచ్చగాడిగా అపర కుబేరుడు..మ్యాటర్ ఏంటంటే..?