టాలీవుడ్లో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్ అండ్ రన్’. సంజయ్ రావ్, నటాషా సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలోని హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
ఈ చిత్రంలో నటాషా సింగ్ ‘రిపోర్టర్ సాక్షి’ అనే ఒక పవర్ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు. రకుల్ ప్రీత్ విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే, సినిమాలో ఆమె పాత్ర ఎంత కీలకమో అర్థమవుతోంది. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న కారు, మిస్టరీని పెంచేలా ఉన్న మరికొన్ని డీటైల్స్ సినిమాపై క్యూరియాసిటీని ఒక్కసారిగా పెంచేసాయి. మునుపెన్నడూ లేని విధంగా నటాషా సింగ్ లుక్ చాలా డిఫరెంట్గా, ఇంటెన్స్గా ఉంది. ఇటీవలే హీరో సంజయ్ రావ్ క్యారెక్టర్ను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమా కాన్సెప్ట్ను రివీల్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు హీరోయిన్ లుక్ కూడా తోడవడంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలోనే త్వరలోనే ‘హిట్ అండ్ రన్’ చిత్ర టీజర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

