కోవిడ్-19 సెకండ్ వేవ్ ఇంకా తగ్గుముఖం పట్టలేదు. గడిచిన కొన్ని రోజుల్లో చాలా మంది చనిపోయారు. మరోవైపు ఆసుపత్రులలో కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ప్రభుత్వాలు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అంటూ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం కొంతవరకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే కరోనా, లాక్ డౌన్ లాంటి పరిస్థితుల వల్ల సినిమా ఇండస్ట్రీపై బాగానే ప్రభావం పడింది. ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమ కుదేలైందనే చెప్పాలి. గత ఏడాది కాలంగా బాలీవుడ్ లో ఒక్క భారీ బడ్జెట్ మూవీ కూడా విడుదల కాలేదు. దీంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతోంది. మరోవైపు సినిమాల షూటింగులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇక ప్రస్తుతం పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడుతుండడంతో సినిమా షూటింగులు స్టార్ట్ చేయాలనీ భావిస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. జూన్ 15 తర్వాత బాలీవుడ్లో సినిమా, టీవీ షూట్లను అనుమతించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.