Directors’ Era: ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్.. డైరెక్టర్ల యుగం మొదలైందా?
- భారతీయ సినీ పరిశ్రమలో మరో చరిత్రాత్మక దశ
- డైరెక్టర్ల యుగం మొదలైందా?
- రామాయణం, వారణాసి ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్
భారతీయ సినీ పరిశ్రమ మరో చరిత్రాత్మక దశలోకి అడుగుపెడుతోందా? అంటే.. అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. ఇప్పటివరకు హీరోల ఆధిపత్యం ఎక్కువగా కనిపించిన ఇండియన్ సినిమాల్లో.. ఇప్పుడు డైరెక్టర్ల యుగం మొదలైందనే చెప్పాలి. కారణం ఒక్కటే.. ఇండియాలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులు ఇప్పుడు మరో రెండు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అవే ఇండియన్ సినిమాల భవిష్యత్తును మార్చబోయే మెగా సినిమాలు.
ఇండియాలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ‘దంగల్’. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నితేష్ తివారి ఇప్పుడు మరో లెజెండరీ ప్రాజెక్ట్తో వస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ మరేదో కాదు ‘రామాయణం’. భారతీయ సంస్కృతి, ఇతిహాసాన్ని ఆధారంగా తీసుకుని రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, ఎమోషనల్ డెప్త్, గ్రాండ్ మేకింగ్తో రామాయణాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో నితేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దంగల్తో ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు గౌరవం తెచ్చిన ఆయన.. రామాయణంతో మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
Also Read
- Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్... 'పెద్ది' రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
- Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
- Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
- Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ 'టాక్సిక్' రిలీజ్ అప్పుడేనా?
ఇక ఇండియాలో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ‘బాహుబలి 2’. ఈ చిత్రం ద్వారా భారతీయ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్కు తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. ఇప్పుడు ‘వారణాసి’ అనే భారీ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నారు. ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండియన్ సినిమాల్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా నిలవబోతోందనే అంచనాలు ఉన్నాయి. యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, గ్రాండ్ విజువల్స్తో పాటు భారతీయ చరిత్రను ప్రతిబింబించేలా ఈ సినిమాను రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్.
దంగల్, బాహుబలి సిరీస్ లాంటి రికార్డ్ బ్రేకింగ్ సినిమాలు చేసిన దర్శకులు నితేష్ తివారి, ఎస్ఎస్ రాజమౌళిలు.. ఇప్పుడు మరోసారి అత్యంత భారీ స్థాయిలో సినిమాలు తెరకెక్కించేందుకు సిద్ధమవుతుండటం ఇండియన్ సినిమాకు గర్వకారణం. హీరోల పేర్ల కన్నా దర్శకుల పేర్లే సినిమాలకు బ్రాండ్గా మారుతున్న ఈ దశలో.. ఇది నిజంగా ‘డైరెక్టర్ల యుగం’ అని చెప్పుకోవచ్చు. రామాయణం, వారణాసి వంటి సినిమాలు విడుదలైతే.. ఇండియన్ సినిమా మరోసారి ప్రపంచ సినీ పటంలో కొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయం.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!