‘నాట్యం’ దర్శకనిర్మాతలకు చిరంజీవి ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటిస్తూ నిర్మించిన సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ‘నాట్యం’ సినిమాకు ప్రశంసలు అందించారు. ‘నాట్యం’ సినిమా చాలా చక్కగా ఉండి మంచి ఫీలింగ్ను కలిగించింది. నాట్యం అంటే ఓ కథను అందంగా, దృశ్యరూపంలో చూపించడం. నాట్యం అంటే కాళ్లు, చేతులు లయబద్దంగా ఆడించడం అనుకుంటారు కానీ దర్శకుడు రేవంత్, సంధ్యా రాజు మాత్రం కథను అందంగా చెప్పడం అని చూపించారు. ఒకప్పుడు ప్రజలకు ఏదైనా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ గా చెప్పేవారు. ఇందులో అలాగే చూపించారు. కె.విశ్వనాథ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను తీసినట్టు అనిపిస్తోంది.
మన కళలు, నాట్యం, సంగీతంపై ఆయనకున్న గ్రిప్, ప్యాషన్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు రేవంత్ అలాంటి ప్రయత్నం చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి వారు రావాలి. మన ఆచారాలు, సంప్రదాయాలు, కళలను మరిచిపోతున్న ఈ తరంలో ఇలాంటి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎంతో ప్యాషన్ ఉన్న సంధ్యా రాజు ఈ సినిమా తీయటానికి ముందుకు వచ్చినందుకు అభినందించాలి. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి డబ్బు కోసం కాకుండా తనకు కళల పట్ల ఎంతో అంకిత భావాన్ని ఉందని చెప్పారు. ఈ సినిమా ద్వారా నాట్యం గొప్పదనం కోట్ల మందికి చేరుతుంది.
Also Read
- Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. "మేము గొర్రెలం కాదు..!"
ఈ సినిమాతో ఆమె తన టాలెంట్ను చూపించాలని అనుకున్నారు. అది వృథా కాదు. రేవంత్, సంధ్యా రాజు ఇద్దరిది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ చిత్రం హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. ఇండస్ట్రీని ‘శంకరాభరణం’కు ముందు ‘శంకరాభరణం’ తరువాత అని అంటుంటారు. అలా శంకరాభరణంను ఎంతగా ఆదరించారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అదో క్లాసిక్. అలానే నాట్యం సినిమాకు కూడా ప్రజాశీస్సులు దక్కుతాయని ఆశిస్తున్నా’ అని అన్నారు.
సంధ్యా రాజు మాట్లాడుతూ ‘ఈ కళ డబ్బుతో రాదు.. అంకితభావం, కష్టపడే తత్వం ఉండాలి. నాట్యం వల్ల జనాలు గౌరవిస్తారనే నా జీవితాన్ని నాట్యానికి అంకితం చేశాను. ఈ ప్రయాణంలో చిరంజీవి గారిని కలవడం సంతోషంగా ఉంది. ఆయన గొప్ప డ్యాన్సర్. సూర్యుడిలాంటి వారు. ఆయన ఆశీర్వాదం లభించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. డైరెక్టర్ రేవంత్ మాట్లాడుతూ ఇలాంటి సినిమా ఎలా తీశావ్? అని అందరూ అంటుంటే నాకు భయంగా ఉంటుంది. ఇందులో కేవలం నాట్యం గురించే కాకుండా మన సంస్కృతిని కూడా చూపించాం. తెలుగుదనం ఉట్టిపడే సినిమా. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. చిరంజీవి గారు మా సినిమాని సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.
తాజావార్తలు
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!