Chiranjeevi Fan Porlu dandalu on Sri Vari Mettu: మెగాస్టార్ చిరంజీవి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా తల్లి అంజనమ్మ, భార్యా పిల్లలతో కలిసి తిరుమలకు వచ్చిన మెగాస్టార్ శ్రీవారి గురువారం (ఆగస్టు 22) ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక విమానంలో బుధవారం (ఆగస్టు 21)రాత్రి తిరుపతి ఎయిర్ పోర్ట్ చేరుకున్న చిరంజీవి కుటుంబం రాత్రి తిరుమలలో బస చేసి తెల్లవారు జామునే శ్రీవారిని దర్శించుకున్నారు.అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి అతని కుటుంబం నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఈశ్వర్ రాయల్ అనే వీరాభిమాని శ్రీవారి మెట్టు మార్గంలో పొర్లుదండాలతో మెట్లు ఎక్కి మొక్కు తీర్చుకున్నాడు. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం బలిజేపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని.
Allu Arjun: అడ్డంగా దొరికేసిన అల్లు అర్జున్.. ఇలా బుక్కయ్యాడేంటి?
నిన్న చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లారు. ముందుగా శ్రీవారి మెట్ల మార్గంలోని మొదటి మెట్టు వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పొర్లు దండాలు పెడుతూ తిరుమల బయలుదేరారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ… గత 21 సంవత్సరాలుగా ప్రతి ఏడాది పొర్లు దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటున్నానని, 22వ తేదీ గురువారం చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని తిరుమలకు పొర్లుదండాలు పెడుతూ వెళుతున్నానని తెలిపారు. చిరంజీవి- కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుతున్నానన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినందుకు కూడా మొక్కు తీర్చుకుంటూ ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నానని అన్నారు.