Allu Arjun: అల్లు అర్జున్ టీమ్ పై కేసు నమోదు
- అల్లు అర్జున్ టీమ్ పై కేసు నమోదు
- సంధ్య థియేటర్ ఘటన పై చిక్కడపల్లి పోలీసుల కేసు నమోదు
- సెక్షన్ 105,118 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు
అల్లు అర్జున్ టీమ్ పై పోలీసు కేసు నమోదు అయింది. సంధ్య థియేటర్ ఘటన పై చిక్కడపల్లి పోలీసుల కేసు నమోదు చేశారు. సెక్షన్ 105,118 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్న సందర్భం లో భద్రత విషయంలో సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. అల్లు అర్జున్ వస్తున్న విషయం పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించింది అంటూ అల్లు అర్జున్ టీం పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.. అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 ప్రపంచ వ్యాప్తంగా గురువారం రాత్రి ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది. ఇటు హైదరాబాద్ లో పుష్ప -2 ప్రీమియర్స్ ను భారీగా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పుష్ప ప్రీమియర్ చూసేందుకు చిత్ర హీరో అల్లు అర్జున్, భార్య స్నేహ తదితరులు సంధ్య థియేటర్ కు గురువారం రాత్రి 9 : 30 గంటల షోకు హాజరయ్యారు.
Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 28 స్పెషల్ ట్రైన్స్..
Also Read
- Buchi Babu: 'పెద్ది'ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
- Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. 'పెద్ది' లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
- Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న 'పెద్ది' రిలీజ్..
- Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలియడంతో అల్లు అభిమానులు సంధ్య థియేటర్ కు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్ , ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , శాన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్ లో సంధ్య 70mm కు వచ్చారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ తొక్కిసలాట లో రేవతి , ఆమె కొడుకు శ్రీ తేజ లు కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారిద్దరిని వెంటనే పోలీసులు విద్య నగర్ లోని దుర్గాభాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందగా , శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుంచి గాంధీ మార్చురీకి తరలించారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!