Allu Arjun: అల్లు అర్జున్ టీమ్ పై కేసు నమోదు
- అల్లు అర్జున్ టీమ్ పై కేసు నమోదు
- సంధ్య థియేటర్ ఘటన పై చిక్కడపల్లి పోలీసుల కేసు నమోదు
- సెక్షన్ 105,118 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ టీమ్ పై పోలీసు కేసు నమోదు అయింది. సంధ్య థియేటర్ ఘటన పై చిక్కడపల్లి పోలీసుల కేసు నమోదు చేశారు. సెక్షన్ 105,118 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్న సందర్భం లో భద్రత విషయంలో సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. అల్లు అర్జున్ వస్తున్న విషయం పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించింది అంటూ అల్లు అర్జున్ టీం పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.. అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 ప్రపంచ వ్యాప్తంగా గురువారం రాత్రి ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది. ఇటు హైదరాబాద్ లో పుష్ప -2 ప్రీమియర్స్ ను భారీగా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పుష్ప ప్రీమియర్ చూసేందుకు చిత్ర హీరో అల్లు అర్జున్, భార్య స్నేహ తదితరులు సంధ్య థియేటర్ కు గురువారం రాత్రి 9 : 30 గంటల షోకు హాజరయ్యారు.
Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 28 స్పెషల్ ట్రైన్స్..
Also Read
- Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
- Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
- Ameer Log: 'అమీర్ లోగ్'ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
- Kayadu Lohar: "రాయితో కొట్టి తల పగలగొట్టా".. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలియడంతో అల్లు అభిమానులు సంధ్య థియేటర్ కు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్ , ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , శాన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్ లో సంధ్య 70mm కు వచ్చారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ తొక్కిసలాట లో రేవతి , ఆమె కొడుకు శ్రీ తేజ లు కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారిద్దరిని వెంటనే పోలీసులు విద్య నగర్ లోని దుర్గాభాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందగా , శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుంచి గాంధీ మార్చురీకి తరలించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!