NTV Telugu Site icon

Bollywood: ఇండియన్ స్క్రీన్ పై మరోసారి ‘రామాయణం’.. రాముడు ఎవరంటె.?

Untitled Design (20)

Untitled Design (20)

భారతీయ ఇతిహాసాల నేపథ్యంలో ఇతిహాసాల నేపథ్యంలో సాగే కథలను తెరకెక్కించేందుకు దర్శకులు  ఆసక్తి చూపిస్తున్నారు. మొన్న ఆ మధ్య వచ్చిన ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర, రీసెంట్ సూపర్ సెన్సేషన్ రెబల్ స్టార్ కల్కి భారతీయ  పురాణాల ఆధారంగా తెరకెక్కినవే. తాజాగా మరోసారి రామాయణాన్ని ఇండియన్ తెరపై చూపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రణ్‌బీర్‌కపూర్‌ హీరోగా  బాలీవుడ్ లో  ‘రామాయణ’ అనే చిత్రం రానుంది. గతంలో వచ్చిన బ్రహ్మాస్త్ర తో భారీ హిట్ కొట్టిన రణ్‌బీర్‌ ఈ దఫా రాముని పాత్రలో కనిపించనున్నాడు. టాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అద్భుతమైన నటనను కనబరిచిన సాయి పల్లవి ‘రామాయణ’ చిత్రంలో సీతగా కనిపించనుంది. పదితలల రావణాసురుడిగా కన్నడ స్టార్ హీరో యష్ నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. దంగల్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్‌ తివారీ ‘రామాయణ’కు దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం కోసం ఏకంగా 12 సెట్లు నిర్మించనున్నారు మేకర్స్. రామాయణంలోని అత్యంత కీలకమైన అయోధ్య, మిథిలా పట్టణాలను కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ఖర్చుకు వెనుకాడక డిజైన్ చేస్తున్నారు. ముంబయిలో 3-D ఫార్మేట్ లో భారీ సెట్స్ నిర్మించనున్నారు. ‘రామాయణ’ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నాడు దర్శకుడు నితేశ్ తివారి. షూటింగ్ చక చక ముగించి VFX పనులను కంప్లిట్ చేసి మొదటి భాగాన్ని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇండియన్ హిస్టరీలో భారీ బడ్జెట్ లో రానున్న ఈ చిత్రాన్ని రాకింగ్ స్టార్ యశ్‌ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also  Read: Ustad: డబుల్ ఇస్మార్ట్ ను డబుల్ స్పీడ్ లో ముగించిన రామ్ పోతినేని