ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APFDC) చైర్మన్గా ప్రముఖ సినీ పంపిణీదారుడు, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ పి. భరత్ భూషణ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన పద్మభూషణ్, నటసింహం నందమూరి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. భరత్ భూషణ్కు బాలకృష్ణ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ.. అందరినీ కలుపుకుంటూ రాష్ట్రంలో సినీ, టీవీ, నాటక రంగాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు.
సినీ పరిశ్రమపై ఉన్న మక్కువతో గత 20 ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉంటూ ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన అనుభవం భరత్ భూషణ్ సొంతం. కేవలం డిస్ట్రిబ్యూటర్గానే కాకుండా, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా పరిశ్రమలోని చిన్న తరహా సమస్యల నుంచి కార్మికుల ఇబ్బందుల వరకు ప్రతి అంశంపై స్పందిస్తూ అందరికీ అండగా నిలిచారు. ఇటీవల ఆయన ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికవ్వడం విశేషం. ఆయన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ వంటి కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించింది.
