Anchor Rashmi Fires on AP Minor Rape Case:ఏపీలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. తొమ్మిదేళ్ల చిన్నారి.. ఆడుకుంటానని బయటకు వెళ్లగా ఆ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో సుజాత, మద్దిలేటి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కూలిపనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.. రెండవ కుమార్తె వాసంతి 5వ తరగతి చదువుతోంది.. అయితే, ఆదివారం సెలవు కావడంతో ఉదయం ఆడుకుంటానని ఇంటికి దగ్గరలోనే ఉన్న పార్క్ లోకి వెళ్ళింది. మధ్యాహ్నం దాటినా ఇంటికి రాలేదు.
Bharateeyudu 2: విజయ్ మాల్యా, గాలి జనార్దన్ రెడ్డిలను టచ్ చేసిన శంకర్?
ఎక్కడుందోనని వెతికగా కనిపించలేదు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురు మైనర్ బాలురపై అనుమానంతో తమదైన స్టైల్ లో విచారించారు పోలీసులు.. అందులో ఒకరు బాలిక వాసంతి పై అత్యాచారం చేసి మల్యాల ఎత్తిపోతల కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నారు. ఈ దారుణానికి కారణమైన ముగ్గురు 15 ఏళ్లలోపు వారే. ఈ అంశం మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. తాజాగా ఈ అంశం మీద స్పందించిన యాంకర్ రష్మీ ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. వాళ్లు పెద్దవాళ్లలాగా రేప్ చేయగలిగితే వాళ్లని పెద్ద వాళ్ళ లాగానే శిక్షించాలి వాళ్ళు చేసిన తప్పుకు ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేదు కాబట్టి వాళ్ళు కచ్చితంగా మైనర్లు అయితే కాదు మైనర్లు అనే ఒక కార్డుతో వాళ్ళు తక్కువ శిక్షతో బయటపడడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ ఆమె తన సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది.