Allu Aravind : సింగిల్ సినిమా వసూళ్లలో కొంత భాగం సైనికులకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్టైనర్ #సింగిల్తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇక ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సింగిల్ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. ఈ చిత్రం తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా గణనీయమైన వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.
Read More : Chiru Anil: చిరు- అనిల్ సినిమా షూటింగ్ ఆరోజు నుండే!
Also Read
- Balakrishna Health Update: శస్త్రచికిత్స సక్సెస్.. బాలయ్య హెల్త్పై బ్రాహ్మణి గుడ్న్యూస్!
- Prabhas Sreenu: "ఆ వార్తలు చదివి చాలా బాధపడ్డా".. సినియర్ యాక్టర్తో రూమర్స్పై ప్రభాస్ శ్రీను రియాక్షన్
- Prabhas: "నా జీవితంలో ప్రభాస్ దేవుడిలాంటి వ్యక్తి"
- Prabhas Sreenu: "ప్రభాస్ దగ్గర డబ్బు అడగాల్సిన అవసరమే రాదు.. ఎందుకంటే!"
తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. అగ్ర నిర్మాతగా, గీతా ఆర్ట్స్ వ్యవస్థాపకుడిగా పేరొందిన అల్లు అరవింద్, సింగిల్ సినిమా సక్సెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు సినీ ప్రేమికులతో పాటు దేశభక్తుల హృదయాలను కూడా ఆకర్షించాయి. సక్సెస్ మీట్లో మాట్లాడుతూ అల్లు అరవింద్, “భారత్ మాతా కీ జై” అని గట్టిగా నినదించి, దేశం పట్ల తమ బాధ్యతను చాటిచెప్పారు. “మా సపోర్ట్ ఎప్పుడూ మన సైనికులకే ఉంటుంది. వారి త్యాగం, ధైర్యం మన దేశ భద్రతకు రక్షణ కవచంలా నిలుస్తాయి,” అని ఆయన ఉద్వేగంతో అన్నారు. ఈ వ్యాఖ్యలు సభలో ఉన్న ప్రేక్షకుల నుంచి భారీ చప్పట్లను రాబట్టాయి.
Read More : Nayanathara: అబ్బే.. నయనతార రెమ్యునరేషన్ వార్తలు అన్నీ ఫేక్?
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మరో కీలక ప్రకటన చేశారు. సింగిల్ సినిమా వసూళ్ల నుంచి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని భారత సైనికుల సంక్షేమం కోసం విరాళంగా అందించనున్నట్లు వెల్లడించారు. “మన సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు. వారికి మనం ఏదో ఒక రూపంలో సాయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సింగిల్ సినిమా విజయం సాధించిన సందర్భంగా, మేము ఈ చిన్న సాయం చేయాలని నిర్ణయించాము,” అని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi: దేశ యువత ఇచ్చిన సూచనలకు కృతజ్ఞతలు.. అర్ధరాత్రి మరోసారి స్పందించిన ప్రధాని మోడీ
-
Balakrishna Health Update: శస్త్రచికిత్స సక్సెస్.. బాలయ్య హెల్త్పై బ్రాహ్మణి గుడ్న్యూస్!
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!