Akshay Kumar : 700 మంది స్టంట్మెన్లకు అక్షయ్ కుమార్ సహాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా తెరపై యాక్షన్ స్టంట్లు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం, ఉత్సాహం కలుగుతాయి. ఒక్కసారి కళ్లు చెదిరే స్టంట్ సన్నివేశాలు పెద్ద తెరపై అలరిస్తాయి. కానీ, ఈ అద్భుతమైన స్టంట్ల వెనుక స్టంట్మ్యాన్లు పడే శ్రమ, ఎదుర్కొనే ప్రమాదం గురించి ఎవరూ ఆలోచించరు. ఇటీవల, తమిళ దర్శకుడు పా రంజిత్ సినిమా సెట్లో స్టంట్మ్యాన్ రాజు దురదృష్టవశాత్తూ మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన స్టంట్మ్యాన్ల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తీసుకున్న ఓ సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
Also Read: War 2: ట్రైలర్ తో దుల్లకొట్టేందుకు రెడీ!
Also Read
- Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
సినిమా పరిశ్రమలో స్టంట్లు చేయడం అనేది అత్యంత సాహసోపేతమైన, అంతే ప్రమాదకరమైన పని. అక్షయ్ కుమార్, తన సినిమాల్లో చాలా వరకు స్టంట్లను స్వయంగా చేస్తాడు. బాడీ డబుల్ను ఉపయోగించడం చాలా అరుదైన విషయం. తమిళ స్టంట్మ్యాన్ రాజు మరణం తర్వాత, అక్షయ్ దేశవ్యాప్తంగా స్టంట్మ్యాన్లకు బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ విక్రమ్ సింగ్ దహియా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read: HHVM : హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్స్ లిస్ట్ ఇదే
విక్రమ్ సింగ్ దహియా మాట్లాడుతూ, అక్షయ్ కుమార్ ఎప్పటి నుంచో స్టంట్మ్యాన్ల భద్రత, వారి బీమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. బాలీవుడ్ సెట్లు గతంలో కంటే ఇప్పుడు స్టంట్ల కోసం చాలా సురక్షితంగా మారాయని, అయినప్పటికీ స్టంట్లు చేయడం ఎంతో ప్రమాదకరమని ఆయన అన్నారు. స్టంట్లు ఎంత జాగ్రత్తగా చేసినా ప్రమాదకరమేనని ఆయన చెప్పారు. రాజు మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన విక్రమ్ సింగ్, దక్షిణాది సినిమా సెట్లతో పోలిస్తే బాలీవుడ్లో స్టంట్మ్యాన్ల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇందులో అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అక్షయ్ కుమార్ దాదాపు 650-700 మంది స్టంట్మ్యాన్లకు బీమా సౌకర్యం కల్పించారని, ఇందులో ఆరోగ్య బీమాతో పాటు ప్రమాద బీమా కూడా ఉందని తెలిపారు. స్టంట్మ్యాన్ సెట్లో లేదా బయట గాయపడితే, రూ. 5-5.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స పొందవచ్చు. అకస్మాత్తుగా మరణిస్తే, వారి కుటుంబానికి రూ. 20-25 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ బీమా విధానాన్ని అక్షయ్ కుమార్ సొంత నిధులతో ప్రారంభించి, నిర్వహణలో కూడా సహాయం చేస్తున్నారని విక్రమ్ సింగ్ ప్రశంసించారు.
తాజావార్తలు
-
iPhone Duo vs iPhone 18 Pro: ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ vs ఐఫోన్ 18 ప్రో.. రోజువారీ వాడకానికి ఏది బెస్ట్?
-
Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
-
BC Reservations: 34 శాతం బీసీ కోటాపై ఉత్కంఠ.. రిజర్వేషన్ల డేటా సమర్పించాలని సర్కార్కు హైకోర్టు ఆదేశం
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
ట్రెండింగ్
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!