Akkineni : కొండా సురేఖను హెచ్చరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నటుడు
- ఘనంగా అక్కినేని శతజయంతి ముగింపు మహోత్సవాలు
- ముఖ్య అథిదిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- సినీనటుడు మురళీమోహన్ కు పురస్కారం'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ముగింపు మహోత్సవాలు విశాఖలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో టాలీవుడ్ సీనియర్ సినీనటుడు మురళీమోహన్ కు ‘అక్కినేని స్మారక పురస్కారం’ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుచేతుల మీదుగా మురళిమోహన్ కు అందజేశారు. అనంతరం మురళీమోహన్ అక్కినేని కుటుంబంపై ఇటీవల జరుగుతున్న పరిణామాలపై పలు కామెంట్స్ చేసారు.
నటుడు మురళి మోహన్ మాట్లాడుతూ ‘తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు దారుణం. ప్రజాపతినిధి స్థానంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి, తెలియకుండా రాజకీయ అటెన్షన్ కోసం ఏదిపడితే అనకూడదు అని సూచనలు చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పై నాగార్జున కోర్టు లో కేసు వేశారు. సోషల్ మీడియా వారు దయచేసి సినిమా వాళ్లపై అసత్య ప్రచారాలు చేయకండి. మంత్రి అక్కినేని కుటుంబాన్ని కించపరుస్తూ మాట్లాడడాన్ని సినీ రంగం మొత్తం ఖండించింది.సోషల్ మీడియా లో సినీ నటులు పై తప్పుడు ప్రచారం చేస్తే ఇక నుండి ఉపేక్షించేది లేదు. అక్కినేని స్మారక పురస్కారం అందుకోవడం ఆస్కార్ అవార్డు సాధించినంత అనందంగా ఉంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అయితే విశాఖ చరిత్ర మారిపోతుంది’ అని అన్నారు.
Also Read
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విశాఖ సినీరంగానికి కేంద్రంగా మారాలి, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి సినిమా ఇండస్ట్రీకి నా పూర్తీ సహకారం అందిస్తాను. ప్రతిభ ఉన్న కళాకారులకు సరైన మార్గాలు లేక పైకి వెళ్లలేకపోతున్నారు.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ ‘కేంద్ర ప్రభుత్వం ద్వారా విశాఖ లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలి’ అని కోరారు.
తాజావార్తలు
-
BCCI New Rule: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2కు ముందు.. కొత్త రూల్ తీసుకొచ్చిన బీసీసీఐ!
-
Jagtial: జగిత్యాల జిల్లాలో బీజేపీ vs కాంగ్రెస్ పార్టీల మధ్య సవాళ్లు.. పట్టణంలో పోస్టర్లు కలకలం
-
RBI New Currency Notes: ఆర్బీఐ సంచలన ప్లాన్..? పాత కరెన్సీ నోట్లు బ్యాన్..!?
-
Explainer: చనిపోయిన తర్వాత భారతీయుల ర*క్తాన్ని తాగుతున్నారు.. వెలుగులోకి భయంకర లెక్కలు!
-
Peddi Team Takes : ఆన్లైన్ టార్గెటెడ్ నెగిటివిటీపై ‘పెద్ది’ టీమ్ లీగల్ యాక్షన్ స్టార్ట్
ట్రెండింగ్
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!