Ajith Kumar: తలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరో, దక్షిణాది చిత్ర పరిశ్రమలో అశేష ప్రజాదరణ సొంతం చేసుకున్న నటుడు ‘తలా’ అజిత్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి మోహిని మణి (85) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. సినిమాలతోనే కాకుండా కార్ రేసింగ్, బైక్ టూరింగ్ లాంటి సాహసాలతో ఎప్పుడూ బిజీగా ఉండే అజిత్.. తన తల్లి మరణంతో తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు. ఈ వార్త అజిత్ అభిమానులతో పాటు తమిళ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
అజిత్ మాతృమూర్తి మరణవార్త తెలియగానే తమిళ సినీ, రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. అజిత్ కుటుంబానికి తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్, లోకనాయకుడు కమల్ హాసన్, బీజేపీ నేత అన్నామలై తదితర ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
One Ticket: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TGSRTC.. ఒక్క టికెట్పైనే ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్లల్లో ప్రయాణం..
-
Allu Arjun: కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్లో హాజరైన అల్లు అర్జున్!
-
Bandi Sanjay: బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు..!
-
Trump-Leavitt: ‘ఆమె నా కంటే ఎక్కువగా పిల్లలనే ప్రేమిస్తుంది’.. ట్రంప్ చమత్కారం
-
Iron Deficiency: నిద్రపోయినా అలసటగా ఉందా? ఐరన్ లోపానికి ఈ 6 సంకేతాలు కావచ్చు..!
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!