Chiranjeevi : చిరంజీవి పేరు తప్పుగా వాడితే ఇక అంతే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ కొణిదెల చిరంజీవికి అనుకూలంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలకమైన అడ్-ఇంటరిమ్ ఇంజంక్షన్ (మధ్యంతర ఉత్తర్వులు)ను మంజూరు చేశారు. ఈ ఉత్తర్వు చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కుల ఉల్లంఘనను నిషేధిస్తూ, అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్, ఇతర ప్రత్యేక లక్షణాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని తక్షణమే నిలిపి వేయనుంది.
కోర్టు ఉత్తర్వుల ముఖ్యాంశాలను పరిశీలిస్తే
26 సెప్టెంబర్ 2025 తేదీ నాటి I.A. No.6275 of 2025 in O.S. No.441 of 2025లో జారీ చేసిన ఈ ఉత్తర్వు ద్వారా, పిటిషన్లో పేరు పొందిన 33 మంది ప్రతివాదులతో పాటు జాన్ డో (ఎవరైనా వ్యక్తి/ఏ సంస్థైనా)కు ఈ నిషేధం వర్తిస్తుంది.
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Yasha Nagula : యూట్యూబ్ను షేక్ చేసిన 'యేషనాగుల'.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
నిషేధ పరిధి: చిరంజీవి పేరు, స్టేజ్ టైటిల్స్ (ఉదా: “MEGA STAR”, “CHIRU”, “ANNAYYA”), వాయిస్, ఫోటో (ఫొటో) లేదా ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఇతర వ్యక్తిత్వ లక్షణాలను ఏ రూపంలోనైనా, ఏ మాధ్యమంలోనైనా, వ్యక్తిగత లేదా వాణిజ్య లాభం కోసం అనుమతి లేకుండా ఉపయోగించటంపై నిషేధం.
* AI దుర్వినియోగంపై ప్రత్యేక దృష్టి: ముఖ్యంగా, కృత్రిమ మేధస్సు (AI) ద్వారా మార్ఫ్ చేసిన ఫోటోలు, వీడియోలను ప్రచారం చేయడం, అలాగే ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ వేదికలపై అనుమతి లేని వినియోగాన్ని ఆపేందుకు కోర్టు జోక్యం కోరారు. ఈ క్రమంలో నలభై ఏళ్లకు పైగా చలనచిత్ర రంగంలో విశిష్ట సేవలందించిన చిరంజీవి ఖ్యాతి, గౌరవానికి ప్రతివాదుల ఉల్లంఘనలు నష్టం కలిగిస్తున్నాయని కోర్టు గుర్తించింది. డిజిటల్, AI ద్వారా జరిగే వాణిజ్యపు దోపిడి, తప్పుడు ప్రతి సృష్టి వల్ల అపరిమిత నష్టం సంభవించే ప్రమాదాన్ని కోర్టు పరిగణించింది.
ఈ ఉత్తర్వుల ద్వారా, TRPs కోసం, వ్యూస్ కోసం చిరంజీవి వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగించినా, తప్పుగా వక్రీకరించినా కఠినమైన పరిహారాలు అమలు చేయబడతాయని కోర్టు స్పష్టంగా హెచ్చరించింది. టెలివిజన్ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్ఫార్ములు, మీడియా సంస్థలు సహా అందరూ దీనికి కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల అనంతరం మెగాస్టార్ చిరంజీవి గారు అక్టోబర్ 11న హైదరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ ని కలసి కోర్టు ఉత్తర్వుల ప్రతిని అందజేశారు. తదుపరి విచారణ అక్టోబర్ 27, 2025కు వాయిదా పడింది.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!