Chiranjeevi : చిరంజీవి పేరు తప్పుగా వాడితే ఇక అంతే!
ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ కొణిదెల చిరంజీవికి అనుకూలంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలకమైన అడ్-ఇంటరిమ్ ఇంజంక్షన్ (మధ్యంతర ఉత్తర్వులు)ను మంజూరు చేశారు. ఈ ఉత్తర్వు చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కుల ఉల్లంఘనను నిషేధిస్తూ, అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్, ఇతర ప్రత్యేక లక్షణాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని తక్షణమే నిలిపి వేయనుంది.
కోర్టు ఉత్తర్వుల ముఖ్యాంశాలను పరిశీలిస్తే
26 సెప్టెంబర్ 2025 తేదీ నాటి I.A. No.6275 of 2025 in O.S. No.441 of 2025లో జారీ చేసిన ఈ ఉత్తర్వు ద్వారా, పిటిషన్లో పేరు పొందిన 33 మంది ప్రతివాదులతో పాటు జాన్ డో (ఎవరైనా వ్యక్తి/ఏ సంస్థైనా)కు ఈ నిషేధం వర్తిస్తుంది.
Also Read
- Varanasi: మహేష్ బాబు వారణాసికి నీటి కష్టాలు.. జక్కన్న రిక్వెస్ట్కు సింపుల్గా నో చెప్పిన జలమండలి!
- Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
- Dacoit OTT Release Date: అడివి శేష్ 'డెకాయిట్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
- Sundar C: రజనీ, కమల్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా.. డైరెక్టర్ సుందర్ సి సంచలన వ్యాఖ్యలు!
నిషేధ పరిధి: చిరంజీవి పేరు, స్టేజ్ టైటిల్స్ (ఉదా: “MEGA STAR”, “CHIRU”, “ANNAYYA”), వాయిస్, ఫోటో (ఫొటో) లేదా ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఇతర వ్యక్తిత్వ లక్షణాలను ఏ రూపంలోనైనా, ఏ మాధ్యమంలోనైనా, వ్యక్తిగత లేదా వాణిజ్య లాభం కోసం అనుమతి లేకుండా ఉపయోగించటంపై నిషేధం.
* AI దుర్వినియోగంపై ప్రత్యేక దృష్టి: ముఖ్యంగా, కృత్రిమ మేధస్సు (AI) ద్వారా మార్ఫ్ చేసిన ఫోటోలు, వీడియోలను ప్రచారం చేయడం, అలాగే ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ వేదికలపై అనుమతి లేని వినియోగాన్ని ఆపేందుకు కోర్టు జోక్యం కోరారు. ఈ క్రమంలో నలభై ఏళ్లకు పైగా చలనచిత్ర రంగంలో విశిష్ట సేవలందించిన చిరంజీవి ఖ్యాతి, గౌరవానికి ప్రతివాదుల ఉల్లంఘనలు నష్టం కలిగిస్తున్నాయని కోర్టు గుర్తించింది. డిజిటల్, AI ద్వారా జరిగే వాణిజ్యపు దోపిడి, తప్పుడు ప్రతి సృష్టి వల్ల అపరిమిత నష్టం సంభవించే ప్రమాదాన్ని కోర్టు పరిగణించింది.
ఈ ఉత్తర్వుల ద్వారా, TRPs కోసం, వ్యూస్ కోసం చిరంజీవి వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగించినా, తప్పుగా వక్రీకరించినా కఠినమైన పరిహారాలు అమలు చేయబడతాయని కోర్టు స్పష్టంగా హెచ్చరించింది. టెలివిజన్ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్ఫార్ములు, మీడియా సంస్థలు సహా అందరూ దీనికి కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల అనంతరం మెగాస్టార్ చిరంజీవి గారు అక్టోబర్ 11న హైదరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ ని కలసి కోర్టు ఉత్తర్వుల ప్రతిని అందజేశారు. తదుపరి విచారణ అక్టోబర్ 27, 2025కు వాయిదా పడింది.
తాజావార్తలు
-
Assembly Elections Results 2026: రిజల్ట్ డే.. తమిళనాడు, బెంగాల్ ఫలితాలపైనే ఉత్కంఠ..
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!