Charmme Kaur @ 20 Years : ఇరవై ఏళ్ళ ఛార్మి!
(ఛార్మి తొలి చిత్రం ‘నీ తోడు కావాలి’కి 20 ఏళ్ళు)
అందాల భామ, ప్రముఖ నిర్మాత ఛార్మి మార్చి 28తో ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అరె… ఛార్మి వయసు అంతేనా? అనుకుంటున్నారా? నటిగా ఛార్మి వయసు అది. ఆమె తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ‘నీ తోడు కావాలి’. ఈ సినిమా 2002 మార్చి 28న జనం ముందు నిలచింది. కేవలం పదిహేనేళ్ళ వయసులోనే కెమెరా ముందు నిలచి, నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఛార్మి. అందం, అభినయం కలబోసుకున్న ఛార్మి కౌర్ కొన్ని సార్లు చిందులతోనూ కనువిందు చేసింది. ప్రస్తుతం నటనకు దూరంగా జరిగినా, చిత్రసీమలోనే నిర్మాతగా కొనసాగుతోంది ఛార్మి.
భీమనేని శ్రీనివాసరావు నిర్మించి, దర్శకత్వం వహించిన ‘నీ తోడు కావాలి’తో ఛార్మి నటిగా వెలుగు చూసింది. దీపక్ హీరోగా తెరకెక్కిన ‘నీ తోడు కావాలి’లో మానస పాత్రలో భలేగా నటించి ఆకట్టుకుంది ఛార్మి. తరువాత హిందీ, తమిళ, మళయాళ, కన్నడ సినిమాల్లోనూ సాగింది. కానీ, నటిగా ఆమెకు గుర్తింపు సంపాదించి పెట్టినవి తెలుగు చిత్రాలే అని చెప్పాలి. కృష్ణవంశీ ‘శ్రీఆంజనేయం’లో ఛార్మి అందం ఆ నాటి కుర్రకారుకు గంధం పూసింది.
Also Read
- Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
- JD Chakravarthy: "అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!" జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
- Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
- Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
‘మాస్’లో నాగార్జునతో మజాగా చిందేసింది. ‘అల్లరి పిడుగు’లో బాలకృష్ణతో తకధిమితై అంటూ ఆడింది. ‘లక్ష్మీ’లో వెంకటేశ్ తో పసందుగా సాగింది. టాప్ స్టార్స్ తో నటించి, విజయాలను చూసినా, వారి చిత్రాల్లో ఛార్మి సైడ్ హీరోయిన్ గానే వెలిగింది తప్ప, సోలో హీరోయిన్ గా మురిపించలేకపోయింది. కృష్ణవంశీ తెరకెక్కించిన ‘చక్రం, రాఖీ’ చిత్రాలతోనూ నటిగా మంచి మార్కులు సంపాదించింది. ప్రభాస్ ‘పౌర్ణమి’లో ఛార్మి మరపురాని పాత్రనే ధరించింది. కొన్ని చిత్రాలలో అతిథి పాత్రల్లోనూ మురిపించింది, ప్రత్యేక గీతాల్లోనూ అలరించింది. లేడీ ఓరియెంటెండ్ మూవీస్ “మంత్ర, మంగళ, అనుకోకుండా ఒక రోజు”లలో తనదైన బాణీ పలికించింది ఛార్మి. హిందీలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘బుడ్డా… హోగా తేరా బాప్’లో అమితాబ్ బచ్చన్ తోనూ కలసి నటించింది. ‘మంత్ర’గా తనదైన అభినయంతో ఉత్తమనటిగా నంది అవార్డును సొంతం చేసుకున్న ఛార్మి ఆపై కూడా కొన్ని చిత్రాలలో ముద్దు ముద్దుగా మురిపించింది. కృష్ణవంశీ ‘చందమామ’లో కాజల్ కు ఛార్మి గాత్రం కూడా అందించింది.
ఛార్మి అందం మందమైనా, ఆమెలోని చలాకీ తనాన్ని ఇప్పటికీ ఇష్టపడేవారు ఎందరో ఉన్నారు. పూరి జగన్నాథ్ ‘జ్యోతిలక్ష్మి’ లో వైవిధ్యమైన పాత్రలో ఆకట్టుకుంది ఛార్మి. ఈ సినిమాతోనే నిర్మాణభాగస్వామిగా తన రూటు మార్చింది. పూరి జగన్నాథ్ తో ఏర్పడిన పరిచయంతో ‘పూరి కనెక్ట్స్ ‘ బ్యానర్ లో ఛార్మి కూడా నిర్మాణభాగస్వామిగా కొనసాగుతోంది. ఈ బ్యానర్ తో మరికొందరు నిర్మాతలతోనూ కలసి చిత్రాలను నిర్మించింది. బాలకృష్ణ ‘పైసా వసూల్’, రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, పూరి తనయుడు ఆకాశ్ నటించిన ‘మెహబూబా’ చిత్రాల నిర్మాణంలో ఛార్మి భాగస్వామి. విజయ్ దేవరకొండ హీరోగా పూరి దర్శకత్వంలో హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతోన్న ‘లైగర్’ నిర్మాణంలోనూ ఛార్మి పాలు పంచుకుంది. భవిష్యత్ లో తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మిస్తానని అంటున్న ఛార్మి, మళ్ళీ ఎప్పుడు తెరపై తళుక్కుమంటుందో చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి అదెప్పుడు సాధ్యమవుతుందో చూడాలి!
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో