Ram Charan: ప్రధాని మోడీతో చరణ్.. ఇది కదా మనకు కావాల్సిన మూమెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం, అందుకోసం వెళ్లిన చరణ్ పైనే హాలీవుడ్ కన్ను ఉండడం తెలిసిందే. త్వరలోనే చరణ్ ఓ హాలీవుడ్ మూవీలో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంతో పాటే చరణ్ దంపతులు అమెరికాలోనే ఉన్నారు. ఇప్పటికే చరణ్ ఖాతాలో ఎన్నో అవార్డులు, రివార్డులు, అరుదైన రికార్డులు వచ్చి చేరిన విషయం విదితమే. ఇక తాజగా మరో అరుదైన ఘనతను చరణ్ అందుకోబోతున్నాడు. అదేంటంటే.. మరో రెండు రోజుల్లో జరగబోతున్న ఇండియా టుడే కాంప్లెక్స్ సమ్మిట్ లో పాల్గొనడానికి రామ్ చరణ్ కు ఆహ్వానం అందిందట. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశంలోని అనేక ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. అలాంటి వేదికపై ఒక హీరో పాల్గొనడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఆ అరుదైన ఘనతను చరణ్ దక్కించుకున్నాడు.
Nani: దసరాను కెజిఎఫ్ తో పోల్చినవారికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాని
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
మార్చి 17, 18 తేదీలో జరగనున్న ఈ సమ్మిట్ లో చరణ్ పాల్గొనడమే కాదు స్పీచ్ కూడా ఇవ్వనున్నాడట. ఇకపోతే ఈ వేదికపై ప్రధాని మోడీ, సచిన్ టెండూల్కర్, దేశ మంత్రులు అందరూ ఉండనున్నారు. ఇక ఇది ఒక్కటే కాదు హిందుస్థాన్ టైమ్స్ అనే మరో మీడియా సంస్థ నిర్వహించబోతున్న లీడర్ షిప్ సమ్మిట్ లో కూడా చరణ్ పాల్గొననున్నాడట. దీంతో చరణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇది కదా మాకు కావాల్సిన మూమెంట్.. ప్రధానితో పాటు మా హీరో సమ్మిట్ లో పాల్గొంటున్నాడు.. అది చరణ్ రేంజ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి అమెరికాలో ఉన్న చరణ్ ఈ సమ్మిట్ కోసం రేపు ఇండియా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?