పవర్ స్టార్ రచ్చ షురూ అయ్యింది. ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఎట్టకేలకు భీమ్లా నాయక్ రిలీజ్ కానుంది. వకీల్ సాబ్ తరవాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం కావడంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాకోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుకుంటూ వస్తున్నా ఈ సినిమా చివరికి ఫిబ్రవరి 25 న రిలీజ్ కి సిద్దమయ్యింది. దీంతో శరవేగంగా పోస్ట్ ప్రోడుక్షణా పనులను పూర్తిచేసేస్తున్నారు మేకర్స్. నిన్నటితో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నేడు సెన్సార్ ని కూడా కంప్లీట్ చేసుకుంది.
సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A ఇవ్వడం జరిగింది. ఇక సెన్సార్ పూర్తి అయినట్లు మేకర్స్ కొత్త పోస్టర్ తో తెలిపారు. ఇక పవన్ జాతర షూట్ కావడంతో ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టారు. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక, సినిమా రిలీజ్ అబ్బో ఈ రెండు వారలు పవన్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. మరి ఈ సినిమాతో పవన్ ఎన్ని రికార్డులు కొల్లగొడతాడో చూడాలి.