Pahalgam Terror Attack : మా హృదయాలను పిండేస్తోంది.. పహల్గాం దాడిపై సెలబ్రిటీలు
- మనసులు కదిలించిందన్న మెగాస్టార్
- క్షమించరాదన్న ఎన్టీఆర్
- సెలబ్రిటీల పోస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఈ ఉగ్రదాడి అత్యంత క్షమించరాని క్రూరమైన చర్య అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వివరించారు.
బాధితులను చూస్తుంటే నా గుండె బరువెక్కుతోంది. ఇలాంటి దారుణాలు జరగకూడదు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
Also Read
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
పహల్గాంలో టెర్రరిస్టుల అటాక్ నా మనసును కదిలించేసింది. సొసైటీలో ఇలాంటి దారుణాలకు చోటు లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ రామ్ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also:Pahalgam Terror Attack: 5 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్
అల్లు అర్జున్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందమైన ప్రదేశంలో జరిగిన ఈ దారుణం నా హృదయాన్ని కదిలించింది. బాధిత కుటుంబాకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలి అంటూ కోరారు.
మూడు నెలల క్రితం షూటింగ్ కోసం పహల్గాం వెళ్లినట్టు నాని తెలిపారు. 200 మంది అక్కడ పనిచేశామన్నారు. ఇంతలోనే అక్కడ ఇలాంటి దారుణాన్ని ఊహించలేదన్నారు. అక్కడ జరిగిన దారుణం తన హృదయాన్ని కలిచివేస్తోందని తెలిపారు. ఇంత దారుణం ఎందుకు చేశారు అంటూ ప్రశ్నించారు.
ఈ దాడిని అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నానని సంజయ్ దత్ అన్నారు. దాడికి పాల్పడిన వారిని క్షమించరాదన్నారు. వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు.
ఉగ్రదాడి తనను కలిచివేసిందన్నారు అక్షయ్ కుమార్. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు చెప్పారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!