Pahalgam Terror Attack : మా హృదయాలను పిండేస్తోంది.. పహల్గాం దాడిపై సెలబ్రిటీలు
- మనసులు కదిలించిందన్న మెగాస్టార్
- క్షమించరాదన్న ఎన్టీఆర్
- సెలబ్రిటీల పోస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఈ ఉగ్రదాడి అత్యంత క్షమించరాని క్రూరమైన చర్య అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వివరించారు.
బాధితులను చూస్తుంటే నా గుండె బరువెక్కుతోంది. ఇలాంటి దారుణాలు జరగకూడదు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
Also Read
- Posani Krishna Murali: 'లవ్ యూ రాజా' డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
- Fauji: ప్రభాస్ 'ఫౌజీ' చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
- Ramayana Trailer: 'రామాయణ' ట్రైలర్కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్కూ గ్రీన్ సిగ్నల్!
- Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
పహల్గాంలో టెర్రరిస్టుల అటాక్ నా మనసును కదిలించేసింది. సొసైటీలో ఇలాంటి దారుణాలకు చోటు లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ రామ్ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also:Pahalgam Terror Attack: 5 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్
అల్లు అర్జున్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందమైన ప్రదేశంలో జరిగిన ఈ దారుణం నా హృదయాన్ని కదిలించింది. బాధిత కుటుంబాకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలి అంటూ కోరారు.
మూడు నెలల క్రితం షూటింగ్ కోసం పహల్గాం వెళ్లినట్టు నాని తెలిపారు. 200 మంది అక్కడ పనిచేశామన్నారు. ఇంతలోనే అక్కడ ఇలాంటి దారుణాన్ని ఊహించలేదన్నారు. అక్కడ జరిగిన దారుణం తన హృదయాన్ని కలిచివేస్తోందని తెలిపారు. ఇంత దారుణం ఎందుకు చేశారు అంటూ ప్రశ్నించారు.
ఈ దాడిని అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నానని సంజయ్ దత్ అన్నారు. దాడికి పాల్పడిన వారిని క్షమించరాదన్నారు. వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు.
ఉగ్రదాడి తనను కలిచివేసిందన్నారు అక్షయ్ కుమార్. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు చెప్పారు.
తాజావార్తలు
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
-
Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!