RGV : రాయదుర్గంలో దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన రూపొందించిన దహనం వెబ్ సిరీస్పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజన సింహా చేసిన ఫిర్యాదు ఆధారంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు సమాచారం.
Also Read : Marco : ‘మార్కో’ సీక్వెల్ రెడీ.. క్రేజీ టైటిల్ ఖరారు!
Also Read
- Sukumar : RC 17 ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి!
- Ram Charan: 'నా కూతురు క్లిం కారా నన్ను పెద్ది అంటోంది'.. ‘పెద్ది’ సక్సెస్ మీట్లో రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్!
- Sukumar: చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే మేము నిద్రపోయేవాళ్లం కాదు.. సుకుమార్ ఎమోషనల్ స్పీచ్!
- Buchi Babu: ‘ఈ జన్మకి ఇది చాలురా’.. స్టేజ్పైనే కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు!
వివరాల్లోకి వెళ్తే – మావోయిస్టులపై తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్లో అంజన సింహా పేరు ప్రస్తావన రావడం, అలాగే ఆయన చెప్పిన విధంగా కొన్ని సన్నివేశాలు తీశామని వర్మ ఇంటర్వ్యూలో పేర్కొనడం పెద్ద వివాదానికి దారి తీసింది. దీనిపై స్పందించిన అంజన సింహా, “నా అనుమతి లేకుండా, నా ప్రమేయం లేకుండా నా పేరు వాడటం చట్టవిరుద్ధం” అని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్మ సినిమాలు, వెబ్ కంటెంట్ తరచూ వివాదాలు రేపుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి ఆయనను చర్చలోకి తెచ్చింది. ఇక ‘దహనం’ వెబ్ సిరీస్కి సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!