Nandamuri Balakrishna: మొన్న ఎన్టీఆర్ చేసింది తప్పైతే.. ఇప్పుడు బాలయ్య చేసిందేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: నందమూరి కుటుంబం గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఏ హీరో ఏది మాట్లాడినా సంచలనమే అవుతోంది. ఇక ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కానీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కానీ టీడీపీ గురించి కానీ, వైసీపీ గురించి కానీ ఒక్క మాట మాటలాడిన అది హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఎన్టీఆర్ టీడీపీ బాధ్యతలు తీసుకుంటాడా..? లేదా.. అనేది ఇప్పటికి ఒక మిస్టరీగా కొనసాగుతూనే ఉంది. ఇక ఇదంతా పక్కన పెడితే నందమూరి కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా, వేరేవారు ఆ కుటుంబాన్ని ట్రోల్ చేసినా అందరు ఒక్క మాట మీదనే ఉండి నందమూరి కుటుంబం స్పందిస్తోంది. ఇక అలా నందమూరి కుటుంబం మొత్తం ఇటీవల సీఎం జగన్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై స్పందించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నో చర్చలకు దారి తీశాయి. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెడితే… ఆయన గౌరవం పెరగదని చురకలు అంటించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు.. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదన్నారు ఎన్టీఆర్. యూనివర్సిటీ కి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేదు అని చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ ఇంత నిదానంగా చెప్పడం, ముఖ్యంగా వైఎస్ఆర్ గురించి ఎన్టీఆర్ మాటలు వింటే ఆయనను ప్రశంసిస్తున్నట్లే ఉందని, తారక్ కన్నా అభిమానులే గట్టిగా ప్రశ్నిస్తున్నారు అని విమర్శించారు. ఎన్టీఆర్ కు తగ్గ మనవడు తారక్ కాదని కూడా తిట్టిపోశారు. ఈ విషయంలో తారక్ చేసింది పెద్ద తప్పని కూడా చెప్పుకొచ్చారు.
ఇక తారక్ విషయం పక్కన పెడితే.. నందమూరి బాలకృష్ణ సైతం వైఎస్ఆర్ ను ప్రశంసించడం టీడీపీ నేతలకు కానీ, నందమూరి అభిమానులకు కానీ రుచించడం లేదట. తాజాగా రిలీజైన అన్ స్టాపబుల్ ప్రోమోలో బాలయ్య “వైఎస్ఆర్ గ్రేట్.. లెజెండ్ ను మిస్ అయ్యాం”అని చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్య అన్న మాటలను గౌరవం కొద్దీ అన్నారు అని కొందరు అంటున్నారు. అయితే అంతకుముందు ఎన్టీఆర్ ను ట్రోల్ చేసినప్పుడు ఇదే గౌరవం అనుకోవచ్చు కదా.. మరి అప్పుడు ఎందుకు ఎన్టీఆర్ ను ట్రోల్ చేశారు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తారక్ పై విమర్శలు చేసిన వాళ్లు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారో చెప్పండి అని అడుగుతున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. రాజకీయాలలో చనిపోయిన వారి గురించి నెగెటివ్ గా మాట్లాడడం పద్దతి కాదు.. అందుకే చంద్రబాబు సైతం ఈ షో లో వైఎస్ఆర్ గురించి నెగెటివ్ గా మాట్లాడింది లేదు. ఇప్పుడు బాలయ్య కూడా అదే పద్దతిని పాటిస్తున్నారు అని మరికొందరు అంటున్నారు. ఇదంతా కరెక్ట్ అయినప్పుడు.. అప్పుడు తారక్ అన్న వ్యాఖ్యలను కూడా ఇలాగే పాజిటివ్ గా తీసుకోవాలి కానీ అప్పుడెందుకు తమ హీరోను నెగెటివ్ చేశారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
Also Read
- Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
- Nithiin: ఫ్లాప్ల తర్వాత ఫుల్ ఫోకస్.. వరుసగా మూడు సినిమాలతో భారీ కమ్బ్యాక్కు సిద్ధమైన నితిన్!
- Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి... వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
- Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు
తాజావార్తలు
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?