Balakrishna Fans: మాకేందిరా ఈ శిక్ష అంటున్న బాలయ్య ఫాన్స్?
Balakrishna Fans on Re Release Movies: టాలీవుడ్లో ఇప్పుడు ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలను వారి అభిమానులు డిమాండ్ మేరకు 4K టెక్నాలజీలో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే సింహాద్రి, ఖుషి, జల్సా, పోకిరి, చెన్నకేశవ రెడ్డి, ఆరెంజ్, రఘువరన్ బీటెక్, నరసింహ నాయుడు, భైరవ ద్వీపం, ఇలా చాలా సినిమాలు అభిమానులను అలరించాయి. సింహాద్రి, ఖుషి, పోకిరి వంటి సినిమాలైతే రీ రిలీజ్ అయిన తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించి అందరినీ షాక్ కి కూడా గురి చేశాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు బాధ పడుతున్నారు.
Also Read
- Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
ఎందుకంటే నందమూరి బాలకృష్ణ కెరీర్ లో దారుణంగా డిజాస్టర్ లుగా భావించే సినిమాలను రీ రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకోవడమే. రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగానే బాలకృష్ణ నటించిన ఒక్క మగాడు, లయన్ సినిమాలు రీ రిలీజ్ చేయనున్నారని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. నిజానికి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి, ఇప్పుడు టీవీల్లో వస్తేనే ఈ సినిమాలను చూడడానికి బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఇష్టపడరు. అలాంటిది ఈ బోరింగ్ మూవీస్ ను మళ్ళీ థియేటర్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు అని బాలయ్య అభిమానులు ఫైర్ అవుతున్నారు.

బాలకృష్ణ నటించిన లెజెండ్, సింహా, లక్ష్మీ నరసింహ లాంటి సినిమాలు ఉండగా ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడమేంటని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈమధ్య రీ రిలీజ్ అవుతున్న సినిమాల కలెక్షన్స్ విషయంలో కూడా అభిమానుల మధ్య పోటీ ఏర్పడుతోంది. మా హీరో రి రిలీజ్ సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నా వాటన్నింటినీ పక్కన పెట్టేసి పొరపాటున టీవీల్లో వచ్చిన లేక ఓటీటీలో కూడా చూడటానికి ఆసక్తి చూపించని సినిమాలు రిలీజ్ చేయడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే అనుమానాలను కూడా సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ విషయం మీద ఆ రీ రిలీజ్ చేస్తున్న నిర్మాతలకు తెలియాలి. నిజానికి ప్రస్తుతం బాలకృష్ణ… సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోందాగి ఇక బాలకృష్ణ కూతురి పాత్రలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ మూవీ అక్టోబర్ 19న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!