Telugu Indian Idol: ‘అన్ స్టాపబుల్’ బాలకృష్ణతో టాప్ 6!
తెలుగు ఇండియన్ ఐడల్ షో చివరి దశకు చేరుకుంది. ‘రేస్ టు ఫినాలే’లో ఆరుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. వాగ్దేవి, వైష్ణవి, లాలస, ప్రణతి, ధరిమిశెట్టి శ్రీనివాస్, జయంత్ సెమీ ఫైనల్స్ కు చేరుకున్నారు. అన్నపూర్ట స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్ లో ఆదివారం రేస్ టు ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ ఎపిసోడ్ కు గెస్ట్ గా మూడు దశాబ్దాల పాటు తన గాత్రంతో యువతను ఊపేసిన ఉషా ఊతప్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.
టాప్ 6 సింగర్స్ లో అన్ స్టాపబుల్ ఎపిసోడ్!
తెలుగు ఇండియన్ ఐడల్ సెమీ ఫైనల్స్ కు నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా హాజరు కావడం విశేషం. మహానటుడు, నటరత్న నందమూరి తారకరామారావు శతజయంతి ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఎపిసోడ్ లో ఎన్టీయార్ పాటలకు ప్రాధాన్యమిచ్చారు. ఆదివారం ఉదయం చిలకలూరి పేటలో ‘అఖండ’ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కు హాజరైన బాలకృష్ణ, అక్కడ నుండి నేరుగా తెలుగు ఇండియన్ ఐడల్ సెమీ ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”’ఆహా’ సంస్థ మొదటిసారి తెలుగులో ఇండియన్ ఐడల్ ను నిర్వహిస్తోంది. ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ షోను చూస్తున్నాను. కంటెస్టెంట్స్ బాగా పాడుతున్నారు. సెమీ ఫైనల్స్ కదా… కొందరు షివరింగ్ అవుతున్నట్టు తెలిసింది. వారిని సెట్ చేద్దామని నేనొచ్చాను” అని అన్నారు. ఈ ఎపిసోడ్ లోనే బాలకృష్ణ తన అభిమానులకు ఓ తీపి కబురు చెప్పబోతున్నట్టు తెలుస్తోంది.
Also Read
- Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
- Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
- Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!
- Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
లైఫ్ టైమ్ ఎక్స్ పీరియన్స్!
వేలాది మంది హాజరైన తెలుగు ఇండియన్ ఐడల్ లో టాప్ సిక్స్ పొజిషన్ కు చేరుకోవడం పట్ల కంటెస్టెంట్స్ వాగ్దేవి, వైష్ణవి, లాలస, ప్రణతి, శ్రీనివాస్, జయంత్ హర్షం వ్యక్తం చేశారు. సెమీ ఫైనల్స్ కు బాలకృష్ణ రావడం ఆనందంగా ఉందన్నారు. అలానే చాలా హోమ్లీ ఎట్మాస్ఫియర్ లో తెలుగు ఇండియన్ ఐడిల్ జరగడం పట్ల న్యాయనిర్ణేతలు తమన్, కార్తీక్, నిత్యా మీనన్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఎన్టీయార్ కథానాయకుడు’ మూవీ తర్వాత మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణ గారిని కలుసుకోవడం ఆనందంగా ఉందని నిత్యా మీనన్ తెలిపింది. తొలిసారి హోస్ట్ గా చేస్తున్న తాను ఈ మొత్తం ప్రక్రియను ఎంతో ఎంజాయ్ చేస్తున్నానని సింగర్ శ్రీరామచంద్ర చెప్పాడు.

గ్రాండ్ ఫినాలేకు గెస్ట్గా మెగాస్టార్!
తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఐదుగురు కంటెస్టెంట్స్ తో పలు దఫాలుగా ఈ ఎపిసోడ్ జరుగనుంది. అందులో తొలుత ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఆ తర్వాత టాప్ త్రీ కంటెస్టెంట్స్ మధ్య పోటీని నిర్వహిస్తారు. ఈ ఫైనల్ ఎపిసోడ్ కు చిరంజీవితో పాటు ఆయన సరసన హీరోయిన్లుగా నటించిన ఐదుగురు అందాల కథానాయికలు సైతం ఈ గ్రాండ్ ఫినాలేలో పాల్గొంటారని అంటున్నారు. మొత్తం మీద మరో మూడు వారాల్లో తెలుగు ఇండియన్ ఐడల్ విజేత ఎవరు అనేది తెలిసిపోతుంది!
తాజావార్తలు
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో